ధర్మారం, జూన్ 10 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో చదువుతున్న పలువురు విద్యార్థులు 2025 -26 విద్యా సంవత్సరంలో జాతీయ ఉపకార వేతనం
( ఎన్ఎంఎంఎస్) కోసం ఎంపికయ్యారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు టి. శ్రవణ్ తేజ, ఎన్. ఇందిరా ప్రియదర్శిని, టి.ఆదిత్య, ఎం.వైష్ణవి, సీహెచ్ అశ్వతేజ ఎంపికయ్యారు. వీరు 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపకార వేతనం ఏటా రూ.12,000 చొప్పున అందుకుంటారు.
ఓకే విద్యా సంవత్సరంలో తమ పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు జాతీయ ఉపకార వేతనానికి ఎంపిక కావడం ఆనందంగా ఉందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజకుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఉపకార వేతనానికి ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు .ఈ విద్యా సంవత్సరం నుంచి జాతీయ ఉపకార వేతనం కోసం 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆయన వివరించారు.