చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి.. అనాధగా మారిన ఓ యువతికి ధర్మారం ధరణి మహిళ క్లబ్ అండగా నిలిచింది.
వివరాల్లోకి వేళ్తే.. ధర్మారం మండలానికి చెందిన బోల్లి సంధ్య చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అమ్మమ్మ వద్దే వుంటుంది. కాగా సంధ్యకు ఎర్రగుంటపల్లికి చెందిన యువకుడితో శుక్రవారం ఖీలవనపర్తిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివాహం జరుగనుంది. అయితే ఆర్థిక కష్టాల్లో ఉన్న సంధ్యకి ధరణి క్లబ్ చేయూతను అందించింది.
సంధ్య పరిస్థితిని తెలుసుకున్న స్థానిక అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కాంపల్లి రాజేశం అంజనాద్రి, రీజియన్ జోన్1 చైర్ పర్సన్ తన్నీరు రాజేందర్. . వెంటనే ఈ విషయాన్ని ధరణి క్లబ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన రీజియన్ చైర్ పర్సన్ సామ పద్మ ఎల్లారెడ్డి దంపతులు తమ పెళ్లిరోజును పురస్కరించుకొని సంధ్యకు మెట్టెల కోసం 10వేలు ఆర్థిక సాయం చేశారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు కామని మంజుల, కార్యదర్శి తన్నీరు పద్మ, కోశాధికారి నాడెం విద్య, రీజియన్ చైర్ పర్సన్ సామ ఎల్లారెడ్డి, జోన్ చైర్ పర్సన్ తన్నీరు రాజేందర్, జిల్లా చైర్ పర్సన్ డాక్టర్ కామని శ్రీనివాస్, కవిత తదితరులు పాల్గొన్నారు.