పెద్దపల్లి కమాన్, ఏప్రిల్ 28: పెద్దపల్లిలో తిరుమల వేంకటేశ్వరుడి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఎమ్మెల్యే దంపతులు దాసరి పుష్పలత-మనోహర్రెడ్డిల ఆధ్వర్యంలో తిరుమల పురవీధుల్లో నిర్వహించే వేడుకను నియోజకవర్గ ప్రజల సమక్షంలో నిర్వహించి స్వామివారి కటాక్షాన్ని ప్రజలంతా పొందేలా జూనియర్ కళాశాల మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. తిరుమల దేవస్థానం నుంచి వచ్చే వేద పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆదివారం సాయంత్రం 5గంటల నుంచి కల్యాణోత్సవం జరుగనున్నది.