పెద్దపల్లి, నవంబర్ 20: పెద్దపల్లి డివిజన్ తపాలా శాఖకు అవార్డుల పంట పండింది. మూడు విభాగాల్లో అరుదైన గౌరవం దక్కింది. ప్రమాద బీమా పథకం చేయించడంలో తెలంగాణ సరిల్ పరిధిలోనే తొలిస్థానంలో నిలువగా, సుకన్య సమృద్ధి ఖాతాలు తెరవడం, గ్రా మీణ తపాలా భీమా పథకం (ఆర్పీఎల్ఐ) చేయించడం, ఏఈపీఎస్ పేమెంట్స్, పోస్టల్, ఐపీపీబీ ఖాతాలు తెరవడం వంటి మరో రెండు విభాగాల్లో మూడో స్థానంలో నిలిచి, అవార్డులు సొంతం చేసుకుంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ (పీఎంజీ) పీవీఎస్ రెడ్డి చేతుల మీదుగా పెద్దపల్లి డివిజన్ ఏఎస్పీతోపాటు ఇతర అధికారులు అవార్డులు అందుకున్నారు.
సమష్టి కృషితోనే సాధ్యం: ఇన్చార్జి పోస్టల్ ఎస్పీ వెంకటేశ్వర్లు
పెద్దపల్లి డివిజన్ శాఖకు రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ అవార్డులు రావడం సంతోషంగా ఉంద ని పెద్దపల్లి డివిజన్ ఇన్చార్జ్ పోస్టల్ సూపరింటెండెంట్ వై వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. పెద్దపల్లి డివిజన్ పోస్టల్ అధికారులు, సిబ్బంది తపాలా శాఖ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేశారన్నారు. అలాగే ఐసీడీఎస్ పర్యవేక్షకులు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామాల సర్పంచులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అవగాహన కల్పించారని, వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.