సుల్తానాబాద్, మార్చి 16 : ఆడబిడ్డల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం షాదీముబారక్, కల్యాణలక్ష్మీ చెక్కులు, పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకొని జీవిస్తున్న పేదలకు జీవో 58 ప్రకారం పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు. గత పాలకులు అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని చెప్పారు.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఇలాంటి పాలన కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు,మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీతారమేశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, సింగిల్విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బుర్ర మౌనికశ్రీనివాస్, బోయిని రాజమల్లయ్య, పురం ప్రేమ్చందర్రావు, పారుపెల్లి గణపతి, తాళ్లపెళ్లి మనోజ్గౌడ్, సూర శ్యాం, తిప్పారపు దయాకర్, డాక్టర్ కలీం, వాహిద్, తహసీల్దార్ యాకన్న, ఎంపీడీవో శశికళ, శిరీష, వాణి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.