కమలాపూర్, నవంబర్ 13: ముదిరాజ్ కులస్థులకు అండగా ఉంటానని మండలి విప్, బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పోతిరెడ్డి రఘుతోపాటు 200 మందికి పైగా కులస్థులు బీఆర్ఎస్లో చేరగా, ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కౌశిక్రెడ్డికి ముదిరాజ్ కులస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కులస్థులు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ ఉచితంగా చేప పిల్లలను అందజేస్తున్నట్లు తెలిపారు. పెద్దమ్మ గుడి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారని, రైతులకు 24గ గంటల కరెంటు, రైతు బంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్ల పెంపు వంటివి తీసుకు వచ్చిన విషయం అందరి కండ్ల ముందు ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ బీమా..ఇంటింటికీ ధీమా పథకంలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉండి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచ్ దేవేందర్రావు, ఎంపీటీసీలు సంపత్రావు, తుర్పాటి అరుణ, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జక్కుల రాజు, నాయకులు నాయినేని తిరుపతిరావు, వాణీరావు, నవీన్కుమార్, ఉపేందర్ పాల్గొన్నారు.