‘నవ్విపోదరు కాక నాకేంటి సిగ్గు’ అన్న చందంగా ఉన్నది ప్రతిపక్ష నాయకుల తీరు. ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వానికో లేదంటే అధికారపార్టీ నేతలకో ఆపాదించడం పరిపాటిగా మారింది. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాస్తవాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడం నేతల కుట్రలను బహిర్గతం చేస్తున్నది. తాజాగా, సిరిసిల్లలో ఓ నవీన్కుమార్ మరణం విషయంలో ఇదే స్పష్టమవుతున్నది. ప్రైవేట్ ఉద్యోగం విషయంలో ఆత్మహత్య చేసుకుంటే రాజకీయరంగు పులిమే ప్రయత్నం జరుగుతున్నది. ఆ యువకుడు అసలు గ్రూప్-1కు దరఖాస్తు చేయకున్నా.. పరీక్ష లీకేజీ కారణంగానే చనిపోయాడంటూ దుష్ప్రచారం చేయగా, ఆ కుటుంబం కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుపై మండిపడుతున్నది. ఆదివారం ఉదయం పరామర్శకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు చేదు అనుభవం ఎదురైంది. తమ కొడుకు మృతిని రాజకీయం చేయొద్దని, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని కుటుంబసభ్యులు స్పష్టం చేయడంతో వారి గొంతులో పచ్చివెలక్కాయపడ్డట్టయింది. అయినా, నాయకులు మళ్లీ రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయడం ప్రతిపక్షాల కుట్రలను బయటపెట్టింది.
కరీంనగర్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిరిసిల్ల పట్టణానికి చెందిన చిటికెన నవీన్కుమార్ (30) శుక్రవారం ఆత్మహత్య చేసుకు న్న విషయం తెలిసిందే. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఆ యవకుడు ఇటీవల ఓ ప్రైవేట్ బ్యాంక్ ఇంటర్వ్యూకు వెళ్లివచ్చాడు. అనూహ్యంగా శుక్రవా రం మధ్యాహ్నం తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఇది సిరిసిల్ల నియోజకవర్గం కావడం, ఇక్కడ మంత్రి కేటీఆర్ ప్రాతిని ధ్యం వహిస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు వ్యూహం పన్నారు. అసలు వాస్తవాలను పక్కన పెట్టి కేటీఆర్ను, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అసలు గ్రూప్ -1 పరీక్షే రాయని ఆ యవకుడు, పేపర్ లీకేజీ వల్లే ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రచారానికి తెరలేపారు. ఏకంగా దీనిపై పీసీసీ అధ్యక్షుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా, ఆ వెంటే ఇక్కడి జిల్లా నేతలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఒకరి వెంట ఒకరు కాంగ్రెస్ నేతలు ప్రెస్మీట్లు పెట్టారు. అటు బీజేపీ నాయకులు కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు.
తిప్పికొట్టిన కుటుంబసభ్యులు
ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా, మాయ మా టలు చెప్పినా లొంగకుండా నవీన్ కుటుంబసభ్యులు మాత్రం తమ బిడ్డ మరణంతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు ప్రతి పక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు. తాము పుట్టెడు దుఖంతో ఉంటే కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని, కొన్ని పార్టీల నాయకులు ఫోన్ చేసి తమతో కలిసి రావాలని అడుగుతున్నారని మండిపడుతున్నారు. తమ బిడ్డ ఏ గ్రూపు పరీక్షలకు ప్రిపేర్ కాలేదని, గ్రూపు ప్రశ్నాపత్రాల లీకేజీలతో చనిపోలేదని, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, అసలు గ్రూప్స్ రాయాలన్న ఉద్దేశమే లే దని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని శనివారం ‘నమస్తే తెలంగాణ’తోనూ వెల్లడించారు. కొంతమంది తమకు తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తున్నారని, ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. దయచేసి రాజకీయం చేయొద్దని, తనకు ఏం సంబంధం లేకపోయినా మం త్రి కేటీఆర్ తమకు భరోసానిచ్చారని, అది తమ కు చాలని చెప్పారు. ‘వాళ్ల మాటలు, వీళ్ల మాట లు విని రాజకీయాలు చేసేటోళ్లం కాదు. బ్లాక్మెయిల్ చేసోటోళ్లం అసలే కాదు’ అంటూ కుండబద్దలు కొట్టారు.
జీవన్రెడ్డికి చుక్కెదురు
‘నవ్విపోదరు కాక నాకేంటి సిగ్గు’ అన్న చం దంగా ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారు. తమ బిడ్డ మరణం విషయంలో రాజకీయం అవసరం లేదని, తమ ఇంటికి ఎవరూ రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నా.. లెక్కలేయకుండా ఆ పార్టీల నాయకులు మాత్రం నవీ న్ మృతి విషయంలో ఎక్కడ సందు దొరక్కపోదా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో విసిగిపోయిన నవీన్ కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం పరామర్శలకు వచ్చిన కాంగ్రెస్ ఎ మ్మెల్సీ జీవన్రెడ్డి, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై ఆగ్రహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తనదైన ైస్టెల్లో రాజకీయం చేసే ప్రయ త్నం చేయగా, ఈ విషయాన్ని గమనించిన నవీన్ తండ్రి నాగభూషణం, బాబాయి శ్రీనివాస్.. జీవన్రెడ్డితోపాటు ఆయన వెంటొచ్చిన కాంగ్రెస్ నాయకులపై సీరియస్ అయ్యారు. ‘అయ్యా మీరొచ్చింది చాలు. వచ్చిన వాళ్లు వచ్చినట్లు చూసి వెళ్లకుండా ఏవోవో మాట్లాడుతున్నరు. లేని పోని అనుమానాలను సృష్టిస్తున్నరు. వాట్సాప్లో (సోషల్ మీడియా) అసత్య కథనాలు ప్రచారాలు చేస్తున్నరు.’ అంటూ ఆగ్రహించారు. ఇంత జరిగినా జీవన్ రెడ్డి మాత్రం, తిరిగి సిరిసిల్ల ప్రెస్భవన్లో ప్రెస్మీట్ పెట్టి, కుటుంబసభ్యులు నిర్మొహమాటంగా చెప్పిన విషయాల ను కాకుండా ఉద్యోగం రాకపోవం వల్లే చనిపోయాడంటూ చెప్పుకొచ్చారు. ఓసారి ఉద్యోగం రాకనేనని, మరోసారి నిరుద్యోగి కావడం వల్లే చనిపోయారంటూ తనకు ఎదురైన ఛీత్కారాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.
షర్మిలదీ అదే తీరు
నవీన్కుమార్ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ షర్మిల వచ్చారు. పరామర్శకు వెళ్లగానే.. ఆమె కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేశా రు. అంతలోనే జోక్యం చేసుకున్న కుటుంబ సభ్యులు.. నిర్మొహమాటంగా జీవన్రెడ్డికి చెప్పిన విషయాన్నే చెప్పారు. ‘అమ్మా.. వీరు వచ్చారు. పరామర్శించారు. ఇక వెళ్లండి’ అన్నట్టుగానే సమాధానమిచ్చారు. నవీన్ తండ్రి నాగభూషణం ఒకదశలో షర్మిలకు రెండు చేతులు జోడించి దండం పెట్టి, తమ కొడుకు మరణాన్ని రాజకీయం చేయవద్దని చెప్పారు. ‘మీలాంటి వాళ్లు వస్తారు.. పోతారు. కానీ చావుతో ఎటువంటి సంబంధం లేకపోయినా మా మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. మాకు ఇంకేమి కావాలి’ అంటూ నిర్మొహమాటంగా చెప్పడంతో షర్మిల ఒక్కసారిగా షాక్కు గురైంది. వెంటనే తేరుకొని ‘నేను రాజకీయం చేయడానికి రాలేదు. మానవత్వంతో పరామర్శకు వచ్చాను’ అని చెపుతూ బయటికి వచ్చారు. కానీ, అదే ఇంటి ముందు మీడియాతో ఇష్టానుసారంగా మాట్లాడారు. నిజానికి ఆమె ఈ మరణాన్ని రాజకీయంగా వాడుకునేందుకే వచ్చిందని, అయితే అక్కడ ఎదురైనా అనుభావాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక.. మళ్లీ తన రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వంపై లేని పోని ఆరోపణలు చేసిన వెళ్లిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.