చెరువులు నింపుకుంటూ.. అలుగులు దుంకుతూ సాగును పండుగ చేసేందుకు గోదావరి జలాలు తరలివస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు కొనసాగుతుండడంతో ఎగువకు పరుగులు పెడుతున్నాయి. సాగునీటికి ఢోకా లేకుండా చేసేందుకు ఎదురెక్కుతున్నాయి. లింక్-1, 2లతో పాటు రాంపూర్, రాజేశ్వర్రావుపేట, ముప్కాల్ పంప్హౌస్ల్లో నడుస్తున్న పంపుల నుంచి ఎస్సారెస్పీకి చేరుకుంటున్నాయి. మరోవైపు వరదకాలువకు ఏర్పాటు చేసిన తూముల ద్వారా గొలుసుకట్టు చెరువులను నింపుతూ మత్తళ్ల వద్ద సందడి చేస్తున్నాయి.
పెద్దపల్లి, జూలై 13(నమస్తేతెలంగాణ)/ రామడుగు : కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్-1, 2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వ ర్షాలకు ప్రాణహిత పరవళ్లు తొక్కి ప్రవహిస్తుండడంతో దిగువన గల లక్ష్మీ బరాజ్లోని అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువన వర్షాలు లేకపోవడంతో లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ పంపులను ఆన్ చేసి ఎత్తిపోతలను కొనసాగిస్తున్నారు. మహదేవపూర్ మండలం మేడిగడ్డలోని లక్ష్మీ బరాజ్కు ప్రాణహిత నుంచి లక్షా 41వేల క్యూసెకుల ఇన్ఫ్లో ఉన్నది. రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాళేశ్వరం ఇంజినీరింగ్ అధికారుల నిరంతర పర్యవేక్షణలో సీఎం కార్యాలయ నిరంతర సలహాలు, సూచనలతో ఎత్తిపోతలను నిరంతరం కొనసాగిస్తున్నారు.
లింక్ -1లో 18 పంపులు..
కాళేశ్వరం లింక్-1లోని లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ పంప్హౌస్ల్లో అధికారులు 18 పంపులను నడిపిస్తున్నారు. కన్నెపల్లిలోని లక్ష్మీపంప్ హౌస్లో గల ఆరు పంపులను నడిపిస్తూ 13,200ల క్యూసెకులను అన్నారంలోని సరస్వతీ బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతీ పంపు హౌస్లో నాలుగు పంపులను నడిపిస్తూ 17,580 క్యూసెకుల నీటి ని మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బరాజ్లోకి, అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతీ పంపు హౌస్లోని నాలుగు మోటర్లను నడిపిస్తూ 15,660 క్యూసెకుల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు.
లింక్-2లో ఆరు మోటర్లతో ఎత్తిపోతలు
ఎనిమిది రోజులుగా లింక్-2లోని నంది, గాయ త్రీ పంప్హౌస్లలో రెండు చొప్పున మోటర్లతో ఎత్తిపోతలను కొనసాగించగా, అవసరాన్ని దృష్టి లో పెట్టుకొని బుధవారం నుంచి మూడు పంపులను ఆన్ చేసి ఎత్తిపోతలు కొనసాగిస్తున్నారు. ఎ ల్లంపల్లికి చేరిన జలాలు టన్నెల్ ద్వారా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంపు హౌ స్కు వెళ్తుండగా, అకడి మూడు మోటర్లను నడిపిస్తూ 9,450ల క్యూసెకుల నీటిని నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. అకడి నుంచి టన్నెల్ ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్ హౌస్కు తరలిస్తుండగా, అకడ మూడు మోటర్లను ఆన్ చేసి 9,450 ల క్యూసెకుల నీటిని ఎత్తి పోస్తున్నారు. ఇక్కడి నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా వరదకాలువకు వె ళ్తుండగా, అక్కడి నుంచి ఎదురెక్కుతూ మ ల్యాల మండలంలోని రాంపూర్ పంపుహౌస్కు తరలుతున్నాయి. ఇక్కడ ఐదు మోటర్ల ద్వారా 7250 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండడంతో మె ట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట పంప్హౌస్ కు వెళ్తున్నాయి. అధికారులు ఇక్కడ నాలుగు మో టర్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో మోటర్తో 1450 క్యూసెక్కుల చొప్పున మొత్తం 5,800 క్యూసెక్కులను వరదకాలువ ఎగువ ప్రాంతానికి ఎత్తిపోస్తున్నట్లు డీఈ రూప్లానాయక్ తెలిపారు. ఎగువన ఉన్న నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్(వరదకాలువ 0.10 కిలోమీటర్) పంపుహౌస్ నుంచి జలాలు ఎస్సారెస్పీలోకి చేరుతున్నాయి.
తూముల ద్వారా చెరువులకు
ఎత్తిపోతల ద్వారా వస్తున్న నీటితో వరదకాలువ నిండుగా మారడంతో అధికారులు కొన్ని రోజులు గా తూముల ద్వారా చెరువులకు తరలిస్తున్నారు. దీంతో చెరువులు నిండి మత్తళ్ల ద్వారా కిందివైపు ఉన్న చెరువులు, కుంటలకు గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి.
ఉదకమ్మ ఉప్పొంగె..
కథలాపూర్, జూలై 13 : కాళేశ్వర జలాలు ఎదురెక్కి వస్తుండడంతో వరదకాలువ తూముల ద్వా రా చెరువులకు పరుగులు పెడుతున్నాయి. నిండి మత్తళ్ల ద్వారా గొలుసుకట్టు చెరువులు, కుంటలకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన ఉదకమ్మ చెరువు కాళేశ్వరం జలాలతో నిండగా, గురువారం నుంచి మత్తడి దుంకుతున్నది. తమ పంటల సాగుకు భరోసా కలగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కష్ట సమయంలో పుష్కలంగా నీళ్లు ఇచ్చి ఆదుకున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెబుతున్నారు.
పంటల సాగుకు ఢోకా లేదు
నాకు మూడెకరాల ఎవుసాయ భూమి ఉంది. ఈ ఏడు వర్షాలు లేక పంటలు సాగు చేసుడు ఎట్లా అని ఇంట్లోళ్లందరం రందితో ఉన్నం. ఇంతలోనే సీఎం కేసీఆర్ కాళేశ్వరం జలాలను వరదకాలువలోకి ఎత్తిపోసి మా ఊరి చెరువును తూముల ద్వారా నింపిండు. దీంతోటి నాకున్న మూడెకరాల్లో వరి సాగు చేస్తానన్న నమ్మకం వచ్చింది. కష్ట సమయంల ఆదుకున్న ముఖ్యమంత్రికి అండగా ఉంటం.
-కొప్పెర సుగుణ, తక్కళ్లపెల్లి (కథలాపూర్)
ఉపాధి కి దిగులులేదు..
మా ఊరి ఉదకమ్మ చెరవు కాళేశ్వరం జలాలతో నిండి మత్తడి దుంకుతుంది. చెరువుల నీళ్లుంటే మా గంగపుత్రుల ఉపాధికి దిగులుండదు. చెరువులోకి కాళేశ్వరం జలాలు వదిలిన సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం. అన్ని కులాల వారి ఉపాధి కి దిగులుండదు. చేపలు పెంపకానికి ప్రభుత్వమే సహాయం చేస్తున్నది. మాకు ఏ ఢోకా లేకుండా అండగా ఉం టున్నది. అందుకే సర్కారు మేలును మరువం.
– జుంబర్తి రాజం, గంగపుత్రుడు, తక్కళ్లపెల్లి (కథలాపూర్)
సాగుపై నమ్మకం వచ్చింది..
వ్యవసాయ పనులు ప్రా రంభించాలనే సమయంల వర్షాలు ఆలస్యం కావడంతో ఎలా ఆలోచనల పడ్డాం. కా,నీ పంటల పనులు మొదలు పెట్టే సమయంలనే సీఎం కేసీఆర్ కాళేశ్వరం జ లాలను వరదకాలువలోకి వదలడంతో తూ ముల ద్వారా మా ఊరి చెరువుకు నీళ్లు వస్తున్న య్. కాళేశ్వరం జలాలతోనే పంటల పనులను ప్రారంభించాం. పంటల సాగుపై నమ్మకం వచ్చింది.
– మొలిగె శ్రీనివాస్, మాజీ సర్పంచ్, తక్కళ్లపెల్లి, (కథలాపూర్)