గోదావరిఖని, డిసెంబర్ 8: ఈనెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని యూనియన్ అధ్యక్షుడు బీ వెంకట్రావు యూనియన్ నేతలకు పిలుపునిచ్చారు. స్థానిక టీబీజీకేఎస్ కా ర్యాలయంలో శుక్రవారం రాత్రి జరిగిన ఆర్జీ-1,2,3 ఏరియాల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేర కు విజయం కోసం శ్రమించాలని సూచించా రు.
ఇప్పటికే అనేక హక్కులు సాధించామని గుర్తు చేశారు. మళ్లీ గెలిపిస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశా లు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కారుణ్య నియామకాలు తెలంగాణ ఇంక్రిమెంట్, రూ. 10 లక్షల ఇంటి రు ణంపై వడ్డీ మాఫీ, క్వార్టర్లలో ఏసీ సౌకర్యం ఇతర అనేక హక్కులు సాధించిన ఘనత తమదేనన్నారు. రామగుండంలోని 3 డి విజన్లలో టీబీజీకేఎస్ భారీ మెజార్టీతో గెలుపొందే విధం గా కృషి చేయాలన్నారు .ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ఆర్జీ-2,3 ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్, గౌతం శంకరయ్య, నూనె కొంరయ్య, తదితరులున్నారు.