ప్రభుత్వం 24 గంటల కరెంట్ను ఇస్తున్నా మీ ప్రాంతంలో తరచూ అంతరాయం కలుగుతున్నదా..? సరఫరాలో లోపాలు, లోవోల్టేజీతో సతమతమవుతున్నారా..? ఇక ఏమాత్రం చింత వద్దు.. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) నడుం బిగించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పల్లెలను దత్తత తీసుకుంటున్నది. ఈ మేరకు కరీంనగర్ సర్కిల్ పరిధిలో పనుల కోసం 3కోట్లు కేటాయించగా, రంగంలోకి దిగిన విద్యుత్ యంత్రాంగం 52 గ్రామాల్లో సమస్యలు ఉన్నట్లు గుర్తించి అడాప్ట్ చేసుకున్నది. ఇటీవలే లూజ్వైర్ల సవరణ, చెట్ల కొమ్మల కత్తిరింపు పనులు ప్రారంభమై చకచకా నడుస్తుండగా, త్వరలోనే కరెంట్ సమస్యలకు చెక్పడబోతున్నది.
– ముకరంపుర, మే 6
NPDCL | ముకరంపుర, మే 6: విద్యుత్ సరఫరాలో అడ్డంకులు, ఎదురవుతున్న ఇబ్బం దులను తొలగించుకునేందుకు ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చు ట్టిం ది. కరీంనగర్ సర్కిల్ పరిధిలో విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారానికి గ్రామాలను దత్తత తీసు కుంటున్నది. ఈ మేరకు ఇప్పటికే యం త్రాంగం రంగంలోకి దిగి ప్రాబ్లమ్స్ను గుర్తించగా, యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టేందుకు సంస్థ రూ.3కోట్ల బడ్జెట్ను సైతం కేటాయించించింది. త్వరలోనే కరెంట్ బాధలకు చెక్పడనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
52 గ్రామాల దత్తత..
కరీంనగర్ సర్కిల్ పరిధిలో ప్రధానంగా లూజ్లైన్లతో పాటు వంగిపోయిన స్తం భాలతో ప్రమాదా లు చోటుచేసుకుంటున్నాయి. సర్వీసుల సం ఖ్యకు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచే పరిస్థితి లేక సరఫరాలో అంతరాయం ఏర్ప డుతున్నది. పలు ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్, ఫెన్సింగ్ లేదు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన విద్యుత్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించింది. సర్కిల్ పరిధిలోని హుజూరాబాద్ డివిజన్ పరిధిలో 16, కరీంనగర్ డివిజన్లో 19, కరీంనగర్ రూరల్ డివిజన్లో 17 గ్రామాలను గుర్తించింది. మొత్తం 52 గ్రామాలను గుర్తించి, దత్తత తీసుకొని ఇప్పటికే పనులు ప్రారంభించింది. విద్యుత్ తీగల కింద ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, వంగిన స్తంభాలతో పాటు సపోర్టు వైర్లు, స్తంభాలను ఏర్పాటు చేసి నష్టాలను తగ్గించేలా చర్యలు చేపడుతున్నారు.
శరవేగంగా పనులు..
ఆయా గ్రామాల్లో 11కేవీ లూజ్లైన్లు 66 గుర్తించి, ఇప్పటి వరకు 63 పనులు పూర్తి చేశారు. 228లైన్లలో 163పూర్తి చేశారు. అలాగే 11కేవీ స్తంభాలు 53వంగిపోయిన స్తంభాలను గుర్తించి, 40స్తంభాలను మార్చారు. 101ఎల్టీ స్తంభాలకు గాను 88 స్తంభాలు వేశారు. 135 తుప్పు పట్టిన ఎల్టీ స్తంభాలను గుర్తించి, ఇప్పటి వరకు ఏడింటిని మార్చారు. 380ఎల్టీ స్తంభాలకు గాను 6స్తంబాలు వేశారు. 11కేవీ మిడిల్ పోల్స్ 427గుర్తించగా 9ఫోల్స్ వేశారు. ఎల్టీ స్తంభాలు 694కు గా ను 12స్తంభాలు కొత్తగా వేశారు. 11కేవీ మిడిల్ ఫోల్స్లో 427కు గాను 9, ఎల్టీ స్తంబాలు 694 స్తంభాలకు 12, రోడ్డు క్రాసింగ్ల వద్ద 11కేవీ 65స్తంభాలకు గాను ఒక్కటి, ఎల్టీ స్తంభాలు 135కు గాను ఐదింటిని వేశారు. 311చోట్ల 11కేవీ, 366ప్రాంతాల్లో ఎల్టీ విద్యుత్ తీగల కింద చెట్ల కొమ్మలను తొలగించారు. సపోర్టు స్తంభాలు/సపోర్టు వైర్లు 11కేవీ 80కి గాను 9, ఎల్టీ 264కు గాను 15పనులు పూర్తి చేశారు.
ఓవర్ లోడ్ను అధిగమించేలా..
పల్లెల్లో పెరుగుతున్న వినియోగంతో ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్లోడ్ పెరుగుతున్నందున వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో 25కేవీ 18, 16కేవీ 14, 25కేవీ 1, 15కేవీ 27, 160కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. 100కేవీ 26, 63కేవీ 9గాను ఒకటి బిగించారు. అలాగే లోపభూయిష్టంగా ఉన్న 52ఫ్లింత్లను గు ర్తించారు. ఏబీ స్విచ్లు 57 గుర్తించి 13 పనులు పూర్తి చేశారు. హెచ్జీ/ఎల్టీ ఫ్యూజులు 35గుర్తించగా, 15 పనులు ప్రగతిలో ఉన్నాయి. 261సరిగా లేని ఎర్తింగ్లకుగాను 250 సరిచేశారు. 2,031వ్యవసాయ కెపాసిటర్లు లేని వాటిని గుర్తించి, 782 బిగించారు.
మొబైల్ నంబర్ల అనుసంధానం..
ప్రతి సర్వీసును వినియోగదారుడి సెల్నంబర్కు అనుసంధానిస్తున్నారు. 2,050 సర్వీసులకుగాను ఇప్పటి వరకు 734పూర్తి చేశారు. డొమెస్టిక్ సర్వీసుతో వ్యవసాయ కనెక్షన్ను అనుసంధానించే ప్ర క్రియలో భాగంగా 2,445గుర్తించి, 546 సర్వీసు ల అనుసంధానించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత వి ద్యుత్ పథకాన్ని వర్తింపజేసేందుకు వారి నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సేకరించే ప్రక్రియ చేపట్టారు. ఇప్పటి వరకు గుర్తించిన 503వినియోగదారుల్లో 55మందికి వర్తింపజేశారు.
సమస్యల్లేని గ్రామాలే లక్ష్యం..
విద్యుత్ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎండీ ఆలోచన మేరకు డీఈ నుంచి ఏఈ వరకు ప్రతి ఒక్కరూ పల్లెలను దత్తత తీసుకున్నారు. గుర్తించిన సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా పనులు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వినియోగదారుల సహకారంతో ముందుకెళ్తున్నాం.
– వీ గంగాధర్, ఎస్ఈ కరీంనగర్ సర్కిల్