రామగుండం : జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, సహనం, అహింసా మార్గాలు ప్రతిఒక్కరూ అనుసరించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా( Amber Kishore Jha ) అన్నారు. గాంధీ జయంతి(Gandhi Jayanti ) వేడుకలను గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ అధికారులు గాంధీ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.
సీపీ మాట్లాడుతూ అహింసే ఆయుధం.. అందరికి ఆదర్శం మహాత్ముని జీవితమని వెల్లడించారు. అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామని, ప్రతిఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. దేశ పౌరులు,గాంధేయ మార్గంలో నడుచుకోవాలని, గాంధీ చూపిన బాటలో విధులు నిర్వర్తించి ప్రజలకు పోలీసు సేవలను అందించాలని సూచించారు. ఈకార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, రాజేంద్ర ప్రసాద్, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, మల్లేశం, సిబ్బంది పాల్గొన్నారు.