చిగురుమామిడి, డిసెంబర్ 3: తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగులకు చేయూతనందిస్తున్నదని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో శనివారం నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవానికి జడ్పీటీసీ రవీందర్తో కలిసి హాజరై మాట్లాడారు. దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం దివ్యాంగులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, తహసీల్దార్ ముబీన్ అహ్మద్, ఎంపీడీవో నర్సయ్య, ప్రధానోపాధ్యాయులు శోభారాణి, రవీందర్ రెడ్డి ఉపాధ్యాయులు బొడ్డు తిరుపతి, భవిత బోధకులు తిరుపతి, మాధవి, సీఆర్పీలు ఆంజనేయులు, శ్రీనివాస్, వెంకటేశం, శ్రీవాణి పాల్గొన్నారు.
మానకొండూర్, డిసెంబర్ 3: మానకొండూర్ ఎమ్మార్సీ ఆవరణలోని భవిత కేంద్రంలో శనివారం దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈవో ఎం మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎంఈవో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఐఈఆర్పీలు సుజాత, ఉమారాణి, సీఆర్పీలు పాల్గొన్నారు.
మానకొండూర్, డిసెంబర్ 3: మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు జయప్రదగౌతమి దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం భవిత కేంద్రంలోని చిన్నారులకు నోట్బుక్స్, పెన్నులు, అరటిపండ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అనసూయ, భవిత కేంద్రం ఉపాధ్యాయులు సుజాత, ఉమారాణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 3: మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల భవిత కేంద్రం ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల ర్యాలీని సర్పంచ్ జక్కని శ్రీవాణి ప్రారంభించారు. దివ్యాంగుల సంరక్షణ గురించి భవిత ఇన్చార్జిలు రాపర్తి గణేశ్, పద్మ వివరించారు. పలువురు విద్యార్థులకు ఎంపీడీవో రవీందర్రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్ బహమతులు ప్రదానం చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.