సుల్తానాబాద్/ఓదెల, ఆగస్టు 25: ప్రభు త్వం హైదరాబాద్లో చేపట్టిన నీరా కేఫ్ సత్ఫలితాలు ఇవ్వడంతో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలంగాణ గీత కార్మిక ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్ పేర్కొన్నారు. ఓదెలలో ఎమ్మె ల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి సర్వాయి పా పన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఓదెలకు వస్తు న్న ఆయనకు సుల్తానాబాద్లో మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీతరమేశ్గౌడ్, గౌడ కులసంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. ఆయాచోట్ల రవికుమార్ మాట్లాడారు. ప్రభు త్వం గౌడ కులస్తుల కోసం అనేక సంక్షేమ పథకాలను తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ట్లు చెప్పారు. మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించిందని, త్వరలో గౌడ సొసైటీల ద్వారా మద్యం షాపులు నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నదని వివరించారు. రైతు బీమా, నేతన్న బీమా మాదిరిగా గీత బీమాను ప్రవేశ పెట్టిందని చె ప్పారు. త్వరలోనే గీత కార్మికుల కోసం సెఫ్టీ మో కులు అందిస్తామన్నారు.
ఏటా 500 నుంచి 600 మంది కార్మికులు చెట్లపై నుంచి జారి ప డుతున్నారని, అందులో కొంత మంది శాశ్వతం గా దివ్యాంగులుగా మారిపోతున్నారని, 160 నుంచి 170 మంది చనిపోతున్నారని, కుటుంబాలు దిక్కులేని వారిగా మిగిలిపోతున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం వారికి 5లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నదని చెప్పారు. అంతేకాకుండా త్వరలో గీత బీమాను ప్రారంభించడంతో మరో 5 లక్షలు వారికి అండగా నిలుస్తాయన్నారు. అలాగే ప్రతి గ్రామంలో కల్లు దాబా మండువాలు ఏర్పాటు చేసేందుకు చర్య లు తీసుకుంటున్నామన్నారు. స్వరాష్ట్రంలోనే పోరాట యో ధులకు సీఎం కేసీఆర్ తగిన గౌరవం ఇస్తున్నారని, అధికారికంగా జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. 3కోట్లతో హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహాన్ని ప్ర భుత్వం నెలకొల్పుతున్నదని, వచ్చే ఏడాది పా పన్న జయంతోత్సవాలను అక్కడే అధికారికం గా నిర్వహించడానికి సీఎం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. కులవృత్తులకు పునర్జీవం పోస్తున్నారని, అనేక పథకాలతో భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కుల వృత్తిలో భాగంగా తాటి చెట్టు పైనుంచి పడి గాయపడ్డ గీత కార్మికులు న లుగురికి ఓదెలలో 15వేల చొప్పున ప్రభు త్వం నుంచి ఆర్థిక సాయం చెక్కులను అందించారు. అనంతరం గౌడ సంఘ అధ్యక్షుడు పచ్చిమట్ల శ్రీనివాస్గౌడ్ నాయకులను శా లువాలతో సన్మాంచారు. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, పెద్దపల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ ఐరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీపీ కునారపు రేణుకాదేవి, ఆకుల మహేందర్, జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్, మాజీ జడ్పీటీసీలు బాలసాని సురేశ్, గోపగాని సారయ్య, గౌడ సంఘ నాయకులు బండారి శ్రీనివాస్, బైరి రవి, మ్యాడగోని శ్రీ కాంత్, బాలసాని ఈశ్వర్, ఆరెల్లి మొండ య్య, మొలుగూరి అంజయ్య, ముత్యం రమేశ్, తోట తిరుపతి, పురెల్ల స్వప్న, మూల మల్లేశం, పోతుగంటి రాజు పాల్గొన్నారు.