చొప్పదండి, జనవరి 25: ప్రజాస్వామ్య పరిరక్షణకు, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ఓటు వజ్రాయుధం లాంటిదని సర్పంచులు తాళ్లపల్లి సుజాత-శ్రీనివాస్గౌడ్, మామిడి లత-రాజేశం పేర్కొన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని కొలిమికుంట, రాగంపేట గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచులు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అవినీతి రహిత సమాజ స్థాపన కోసం పాటు పడుతామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. వైద్యులు అద్నాన్, కార్తీక్, హెల్త్ ఆఫీసర్ రవినాయక్, ఎంపీహెచ్వో ఉమామహేశ్వర్, వార్డు సభ్యులు నెల్లి శంకరమ్మ, పంజాల బొంది, గసికంటి సోనియా-కుమార్, గోపు రమ-జితేందర్రెడ్డి, యామ గంగరాజు, పబ్బ శ్రీనివాస్, కార్యదర్శులు ప్రవళిక, శ్రీకాంత్, ఏఎన్ఎం సుమలత, అంగన్వాడీ టీచర్లు సరోజన, సులోచన, ఎల్లమ్మ, ఆశ కార్యకర్తలు శారద, లలిత, స్నేహ, తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి, జనవరి 25: ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత యువతపై ఉందని యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు బందారపు అజయ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రేవెల్లి గ్రామంలో 18 ఏళ్లు నిండిన యువతీయువకులకు ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అజయ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సతీశ్కుమార్, సంతోష్, సతీశ్, సందీప్, సాయి అనీష్, హరీశ్, మణికంఠ, మనోజ్ పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, జనవరి 25: కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఓటరు నిష్పక్షపాతంగా ఓటు హకు వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జనవరి 25: శాతవాహన విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ హరికాంత్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ తిరుపతి, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాధిపతి మనోహర్, అధ్యాపకులు డాక్టర్ కృష్ణకుమార్, డాక్టర్ మనోజ్కుమార్, డాక్టర్ అనూష, నరేశ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్, జనవరి 25: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ అధికారి శ్రీనివాసరావు ఉద్యోగులకు సూచించారు. నగరంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో బుధవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యాలయ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు శర్మ, కవిత, ఎన్ రాజమౌళి, రశీద్, మనోహర్, జమీర్, శ్రీనివాస్, పాషా, సాయికృష్ణ, చంద్రమోహన్, మోసిన్, కుమార్యాదవ్, కమలాకర్, కమాలొద్దీన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.