జమ్మికుంట, డిసెంబర్ 23: దేశానికి వెన్నెముక అయిన రైతును గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్రావు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని కాటన్ మార్కెట్ యార్డులో జాతీయ రైతు దినోత్సవాన్ని మార్కెట్ కార్యదర్శి జీ రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆదర్శ రైతులు నీల ఎల్లయ్య(వీణవంక), నేరెళ్ల వసంత(సిరిసేడు), ముదాం తిరుపతి(ఆబాది జమ్మికుంట)కి శాలువాలు కప్పి సన్మానించారు. స్వీట్లు పంపిణీ చేశారు. తర్వాత చైర్మన్ మాట్లాడారు. ఆరుగాలం కష్టించి రైతులు పంటలు తీస్తున్నారని, ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. అన్నదాత సాగు లేకుంటే అన్నమే లేదని, అలాంటి రైతన్నను టీఆర్ఎస్ సర్కార్ అన్ని విధాలా ఆదుకుంటున్నదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతికేలా చేస్తున్నదని, కేసీఆర్కు అన్ని వర్గాలు రుణపడి ఉండాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మార్కెటింగ్ శాఖ అధికారులు యాకయ్య, లక్ష్మణ్, ఖరీదుదారులు నారాయణ, శ్యాం, రవి, ప్రకాశ్, లింగారావు, అడ్తిదారులు రాంరెడ్డి, తిరుపతి, అశోక్, మనోహర్, కుమార్, రవి, గుమస్తాలు, దడ్వాయిలు, సిబ్బంది, రైతులు ఉన్నారు.
‘ఈ-నామ్’తో కొనుగోళ్లలో పారదర్శకత
కొనుగోళ్లలో పారదర్శకత ఈ-నామ్తోనే సాధ్యమని మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్రావు, కార్యదర్శి జీ రెడ్డి నాయక్ పేర్కొన్నారు. గురువారం కాటన్ మార్కెట్లోని ఈ నామ్ కార్యాలయంలో ‘ఈ-నామ్’పై రాష్ట్ర ఇన్చార్జి చంద్రశేఖర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్కెట్ పాలకవర్గంతోపాటు ఖరీదుదారులు, అడ్తిదారులు, రైతులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. రైతులు తమ ఉత్పత్తులకు మార్కెట్కు తేవడం, ఆన్లైన్లో నమోదు చేయించుకోవడం, తర్వాత వ్యాపారులు రైతుల ఉత్పత్తులకు ధర కోడ్ చేయడం, ఎక్కువ ధరలకు రైతులు అమ్ముకోవడం, లావాదేవీలు, తదితర అంశాలను వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం చైర్మన్, కార్యదర్శి మాట్లాడారు. ఈ-నామ్తో రైతుల నాణ్యమైన ఉత్పత్తులకు జాతీయ మార్కెట్లో అత్యుత్తమ ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. ఆన్లైన్ ట్రేడింగ్లో ఎక్కువ కోడ్ చేసిన వ్యాపారికి రైతు తమ పంటలను అమ్ముకోవచ్చని తెలిపారు. ఈ నామ్తో దళారుల బెడద ఉండదని చెప్పారు. రైతుల ప్రయోజనం కోసం ఈ నామ్ను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ఈ-నామ్ కొనుగోళ్ల కోసం ప్రత్యేక సిబ్బంది, సాఫ్ట్వేర్ను గతంలోనే రూపొందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ మార్కెట్ డైరెక్టర్లు, వ్యాపారులు, అడ్తిదారులు, రైతులు, మార్కెట్ అధికారులు, సిబ్బంది, తదితరులున్నారు.