కలెక్టరేట్, సెప్టెంబర్ 14: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు, ప్రత్యేక అధికారులు, పోలీస్ అధికారులతో కలిసి వేడుకల నిర్వహణపై సమీక్షించారు. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టి 70ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 16 నుంచి 18వ తేదీ దాకా మూడు రోజులపాటు తెలంగాణ పోరాట నిరతి, జాతీయభావం, తెలంగాణ సంసృతి ఉట్టిపడేలా నిర్వహించాలన్నారు. 16న అన్ని నియోజకవర్గాల్లో 15వేల మందితో ర్యాలీ తీయాలని, సమావేశం అనంతరం వసతి కల్పించాలని సూచించారు. జన సమీకరణకు బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలను వినియోగించుకోవాలని సూచించారు.
జిల్లా కేంద్రంలో ర్యాలీని అమరవీరుల స్తూపం, చర్చి, బస్టాండ్, భగత్సింగ్ విగ్రహం మీదుగా అంబేదర్ స్టేడియం దాకా నిర్వహించాలని ఆదేశించారు. 17న జాతీయ జెండా ఆవిషరణ, 18న జిల్లాలో సాంసృతిక కార్యక్రమాలు, స్వతంత్ర సమరయోధులు, కవులు కళాకారులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఒగ్గు కథ ద్వారా తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టిన మిద్దెరాములు కుటుంబ సభ్యులతో ఒగ్గు కథ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతం చేయడంలో అధికారులు ముందుండాలని సూచించారు. వేడుకల నిర్వహణకు గాను హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిగా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, మానకొండూర్కు జడ్పీ సీఈఓ ప్రియాంక, చొప్పదండికి డీఆర్డీఓ పీడీ శ్రీలతను నియమించినట్లు ప్రకటించారు. కరీంనగర్లో ఆర్డీవో పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎకడ ఎటువంటి పొరపాట్లకు ఆసారం లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఇక్కడ చొప్పదండి, మానకొండూర్ ఎమ్మెల్యేలు సుంకె రవిశకర్, రసమయి బాలకిషన్, మేయర్ వై సునీల్ రావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, మున్సిపల్ కమిషనర్ సేవాఇస్లావత్ ఉన్నారు.
అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన
కొత్తపల్లి, సెప్టెంబర్ 14: జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ బుధవారం పరిశీలించారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా పనులు చేపట్టాల ని డీవైఎస్ఓ కే రాజవీరు, ఇతర అధికారులకు సూ చించారు. మంత్రి వెంట మేయర్ సునీల్రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, చల్ల హరిశంకర్, సత్తినేని శ్రీనివాస్ ఉన్నారు.