ఆటో ఎక్స్పో గ్రాండ్ సక్సెస్ అయింది. కరీంనగర్ జిల్లావాసులకు ఎంతో దోహదపడింది. జిల్లా కేంద్రంలోని సర్కస్ గ్రౌండ్ వేదికగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన షో, ఆదివారం సాయంత్రం క్లోజ్ కాగా, వినియోగదారుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆఖరిరోజు నగర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావమే కాదు.. అదే స్థాయిలో తమకు నచ్చిన వాహనాలను బుకింగ్ కూడా చేసుకున్నారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఆర్డీవో మహేశ్వర్ నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యాలను అభినందించారు. వాహన ప్రియుల కోసం ఒకే దగ్గర అన్ని రకాల వాహనాలు అందుబాటులోకి తీసుకురావడం చాలా గొప్ప అలోచన అని కొనియాడారు.
– కరీంనగర్ కమాన్చౌరస్తా, మార్చి 24
ఆటో ఎక్స్పో అట్టహాసంగా సాగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే (సర్కస్) గ్రౌండ్ వేదికగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన వాహన షో గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం ముగింపు కార్యక్రమానికి నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, కరీంనగర్ ఆర్డీవో కే మహేశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరై వాహన మోడల్స్ను పరిశీలించారు.
ఈ షోకు మెయిన్ స్పాన్సర్ ఆదర్శ ఆటో మోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అసోసియేట్ స్పాన్సర్లుగా మహవీర్ గ్రూప్ మెర్సిడిస్ బెంజ్, ఆడి హైదరాబాద్, వోల్వో, మహవీర్ ఐసుజు, ప్రైడ్ జీప్, గ్రీన్ హోండా, మోటార్ లైన్ మహీంద్ర డీలర్, క్వాంటం ఈ-స్కూటర్స్, కాకతీయ టయోటా, మారుతి సుజుకి, నెక్సా, మారుతి సుజుకి ఎరేన, ఆదర్శ ట్రూ వాల్యూ, మాలిక్ కియా, హఋరా సుజుకి సంస్థలతోపాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర సంస్థలు పాల్గొనగా, వాటి వివరాలు తెలుసుకున్నారు.
ముగింపు వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలభవన్ సంగెం రాధాకృష్ణ బృందం చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత కంపెనీ ప్రతినిధులకు, బాలబాలభవన్ చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో షోలో నమస్తే తెలంగాణ కరీంనగర్ యాడ్స్ మేనేజర్ రేణ మల్లయ్య, కరీంనగర్, ఆదిలాబాద్ ఎడిషన్ ఇన్చార్జిలు ఐ సుభాష్, వీ సంపతి, స్టాఫర్ దొంత వెంకటస్వామి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ బాలకిషన్రావు, ప్రొడక్షన్ ఇన్చార్జి రాజిరెడ్డి, టెక్నికల్ ఇన్చార్జి రామకృష్ణ, హెచ్ఆర్ ఇన్చార్జి శ్రీలత, స్టోర్ ఇన్చార్జి రవి, అకౌంటెంట్ రాజేందర్, నమస్తే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆటోషో చివరి రోజు ఆదివారం కావడంతో జ్యోతిబా ఫూలే మైదానం ఉదయం నుంచే వినియోగదారులతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం సమయంలో పెద్ద సంఖ్యలో నగరవాసులు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. వాహనాల ధర, మైలేజ్, ఎన్ని రోజుల్లో డెలివరీ చేస్తారు..? ఈ షో ద్వారా ఎంత రాయితీ ఇస్తారు..? ఇలా వివరాలు తెలుసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. పలువురు తమకు నచ్చిన వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేయగా, మరొకొందరు ఫొటోలు దిగుతూ కనిపించారు.
వాహన ప్రియుల కోసం అన్ని వాహనాలను ఒకే దగ్గరికి తీసుకురావడం మంచి అవకాశం. ఇందుకు నమస్తే తెలంగాణ బాధ్యతాయుత కార్యక్రమాన్ని నిర్వహించడం మంచి పరిణామం. ప్రతి రోజూ అనేక రకాల వార్తా కథనాలతో ప్రజల్లో ఉండే పత్రిక, ప్రజల సౌకర్యాల కోసం మారుతి నుంచి మెర్సిడెజ్ దాకా అన్ని రకాల కంపెనీల వాహనాలను, రుణాలు ఇచ్చే బ్యాంకులను సైతం అందుబాటులో ఉంచాలనే ఆలోచన చాలా మంచిది. ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరిన్ని నిర్వహించాలి. జిల్లా వాసులు హైదరాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే వాహనాలు కొనుగోలు చేసేలా చూడాలి.
– కొండూరి రవీందర్ రావు, నాఫ్స్కాబ్ చైర్మన్
కరీం‘నగరంలోని’ సెంటర్ ఆఫ్ సిటీలో నమస్తే తెంగాణ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామం. మార్కెట్లో ఉన్న కొత్త వాహనాలతోపాటు ఎక్సేంజ్ చేసుకునేందుకు అవకాశం కల్పించడం సంతోషించదగ్గ విషయం. ఒక కంపెనీ షోరూంకు పోయి ఒక వాహనాన్ని చూడగలం కానీ, అన్ని రకాల కంపెనీల వాహనాలు అందుబాటులోకి తెచ్చిన నమస్తే తెలంగాణకు ప్రత్యేక అభినందనలు. ఇక్కడ ఉన్న వాహనాలు ఒకదానికి ఒకటి పోటీ అన్నట్లుగా ఉన్నాయి. వాటి గురించి వచ్చే సందర్శకులకు వివరించి, వారి అవసరం మేర వాహనాలు అందించేలా ఏర్పాట్లు బాగున్నాయి. ఇక్కడ ఇన్ని కంపెనీల వాహనాలు, వాటి కోసం తరలివచ్చిన సందర్శకులను చూస్తుంటే సంతోషంగా ఉంది.
– కే మహేశ్వర్, కరీంనగర్ ఆర్డీవో