సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి 14: పీఏసీఎస్లలో కామన్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటుతో రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. కనుకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో విండో చైర్మన్ కోట వీణ-రాజమల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఏస్సీ సెంటర్ను డీసీసీబీ చైర్మన్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా రవీందర్రావు మాట్ల్లాడారు. రైతుల సౌకర్యార్థం అన్ని గ్రామాల్లో పీఎసీఎస్కు సంబంధించి మరిన్ని సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, మేనేజర్ హన్మంతరావు, కేడీసీసీబీ సుల్తానాబాద్ మేనేజర్ శశిధర్రావు, ఫీల్డ్ ఆఫీసర్ సాగర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కొమ్మిడి వెంకటరాంరెడ్డి, సెక్రెటరీ శంకరయ్య, సభ్యులు శంకరయ్య, రమేశ్, శ్రీనివాస్, శ్రీనివాస్, చంద్రశేఖర్రెడ్డి, జగన్, సంఘ సిబ్బంది, రైతులు ఉన్నారు.