గంభీరావుపేట, నవంబర్ 19: ‘అధికారం కోసమే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని.. ఆ పార్టీల నాయకులు చెప్పే అబద్ధాలను నమ్మకం డి.. తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్ఎస్ హయాం లో జరిగిన అభివృద్ధి చూడండి’.. అని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మంత్రి కేటీఆర్కు మద్దతుగా జగదాంబతండా, దమ్మన్నపేటలో ఎన్నికల ప్రచా రం నిర్వహించారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తూ, మంత్రి కేటీఆర్కు మద్దతుగా ఇంటింటా ఓట్లు అభ్యర్థించారు. అనంతరం గ్రామకూడలి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఒక్కటైనా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా.. అని ప్రశ్నించారు.
దేశంలోని ఐదు రాష్ర్టా ల్లో ఎన్నికలు జరుగుతుంటే.. జాతీయ పార్టీలు తెలంగాణలో అధికారం కోసం బూటకపు మ్యానిఫెస్టోతో ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడుతున్నాయని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమం చేయని ప్రతి పక్ష పార్టీల నాయకులు, ఇప్పుడు అధికారం కోసం మాత్రమే పోటీపడుతున్నారని ఆరోపించారు. జరిగిన అభివృద్ధిని చూసి మంత్రి కేటీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
ఒక్క దమ్మన్నపేటలో 1,533మంది ఉండగా, 1525మందికి ఆయా పథకాల ద్వారా లబ్ధి చేకూరడం బీఆర్ఎస్ పాలనకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొత్తింటి హన్మంతరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, సర్పంచులు అజ్మీరా బాల్య, సిరిగిరి లక్ష్మి, ఉప సర్పంచ్ అరుట్ల అంజిరెడ్డి, ఎంపీటీసీ మూడావత్ కవిత, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు అంబర్సింగ్, నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్రెడ్డి, గంద్యాడపు రాజు, నాగపురి బాలరాజుగౌడ్, కోల రాజు, వేణు, చెవుల మల్లేశం, బీమ్లానాయక్, రాజిరెడ్డి, చంద్రమౌళి, మోహన్రెడ్డి, బాల్రెడ్డి, శేఖర్గౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.