పెద్దపల్లి, మే 6 : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.కోటి 78 లక్షల 97 వేల 132 జప్తు చేసినట్లు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజామ్మిల్ ఖాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సరైన ఆధారాలు పరిశీలించి గ్రీవెన్స్ కమిటీ రూ.కోటి 67 లక్షల 37 వేల 32లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. సరైన ఆధారాలు సమర్పించని కారణంగా రూ.11 లక్షల 60 వేల 100లు విడుదల చేయలేదని తెలిపారు.