కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 28 : బడుగు, బలహీనవర్గాల కోసం తనవంతుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న కొత్త కృష్ణవేణీ శ్రీనివాస్, తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్నూ రు కాపు సంఘం మహిళా అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె సేవలు ము న్నూరుకాపు కులానికి ఎంతో అవసరమని భావించిన హైదరాబాద్ 150 డివిజన్లలోని మున్నూరుకాపు మహిళా కన్వీనర్లు అంతా కలిసి, ప్రప్రథమ మహిళా అధ్యక్షురాలిగా ఎలె క్ట్ చేశారు. కృష్ణవేణి పుట్టినిల్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బోనాల. మెట్టినిల్లు కరీంనగర్ కాగా, భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు.
సేవారంగంలో ఆమె చూపుతున్న చొరవ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే కాగా, ఇప్పటికే ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. గవర్నర్తో సహా పలు సంస్థలు, సంఘాల నుంచి ఎన్నో సార్లు సత్కారాలు కూడా పొందారు. తాజాగా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడంపై కృష్ణవేణి మాట్లాడారు. మున్నూరుకాపు మహిళలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి అభ్యున్నతి కోసం పాటుపడతానని చెప్పారు. అలాగే తన సేవాకార్యక్రమాలు ఎప్పటిలాగే కులమతాలకతీతంగా, వర్ణవర్గవిభేదాలు లేకుండా యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు సత్కరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆడబిడ్డ కావడంతో అభిమానులు, ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.