కార్పొరేషన్, జనవరి 11: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వాడవాడలా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ డెయిరీలో బుధవారం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో 600 మందికి పైగా మహిళలు, బాలికలు పాల్గొని రంగురంగుల రంగవల్లులు వేశారు.
అలాగే నగరంలోని కిమ్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థినులు, హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు, చొప్పదండి జీఆర్ఆర్ గార్డెన్ ఆవరణలో మహిళలు అందమైన ముగ్గులు వేశారు. విద్యాసంస్థల్లోనూ పోటీలు నిర్వహించారు. ఆయాచోట్ల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా రంగవల్లులను తీర్చిదిద్దారు. ప్రధానంగా సామాజిక అంశాలను స్పృశిస్తూ వేసిన ముగ్గులు ఆకర్షణగా నిలువగా, కొందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించేలా వేశారు.