కరీంనగర్ : బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ఓటు హక్కును వినియోగించు కున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొదురుపాక స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేటలో ఓటు వేశారు. భార్య శ్రీనిత, తనయుడు అర్చిస్ మాన్తో కలిసి వచ్చిన మంత్రి ఓటు వేసి.. ప్రజలంతా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
గురువారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, యువకులు , మహిళలు వృద్ధులు తమ తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.