కలెక్టరేట్, మార్చి 19 : ఉపాధి కూలీలపై మరో పిడుగు పడబోతున్నది. మొన్న పని చేస్తున్న చో టు నుంచే ఫోటోలు పంపేలా ఆదేశాలు జారీ చేసి న కేంద్రం, నిన్న బడ్జెట్లో అరకొరగా మాత్రమే నిధులు కేటాయించగా, తాజాగా పనికి హాజరు కాని కూలీల జాబ్ కార్డులు తొలగించేందుకు సన్నద్ధమవుతోంది. ఈమేరకు ఎన్ఆర్ఎంఈజిఎస్ సి బ్బందికి ఆదేశాలు అందడంతో సక్రమంగా పనికి హాజరుకాని కూలీల వివరాలు సేకరించటంలో ని మగ్నమయ్యారు. పూర్తికాగానే జాబితాలు కేంద్రానికి పంపేందుకు సన్నాహాలు చేస్తుండగా, అందిన వెంటనే వారి నోట్లో మట్టికొట్టేందుకు కేంద్రం సి ద్ధమవుతోంది.
జిల్లావ్యాప్తంగా ఒక్కరోజు కూడా ఉపాధి పనులకు హాజరుకాని వారి జాబితాలు సిద్ధం చేయగా, తరచుగా గైర్హాజరవుతున్న వారి వివరాల సేకరణలో ఈజిఎస్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఉపాధి కూలీల్లో ఆందోళన మొదలైంది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే సుమారు 99వేలకు పైగా కూలీల జాబ్కార్డులు రద్దు కానుండగా, కేంద్ర వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉం టూ కనీస పని లభించని వారికి రోజుకు రెండు పూటలా భోజనం తినేలా 2006 ఫిబ్రవరి 2న అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కూలీలకు పని కల్పించేందుకు ఈ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించింది. అనతికాలంలోనే ఈ పథకం పేద కుటుంబాల పాలిట కా మధేనువుగా మారగా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు కూలీల ఉపాధికి గొడ్డలిపెట్టులా మారుతుంది.
కూలీలకు ఏడాదికి వందరోజుల పని దినాలు కల్పిస్తూ, వ్యవసాయానుబంధ పనులకు కూడా ఉపయోగ పడేలా మొదలైన ఈ పథకం ద్వారా గ్రామాల్లో అనేక రకాల పనులు చే పట్టడంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులకు కూడా శాశ్వత పరిష్కార మార్గాలు ల భించాయి. సుమారు 40 రకాల పనులకు పైగా చే పట్టి, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ఈ పథకం బాటలు వేసింది. ప్రధానంగా రైతుల బావుల్లో పూడికతీత, పొలాల గట్లపై టేకు చెట్లు నాటడం, వాటిని రెండేళ్ల పాటు సంరక్షించడం, వ్యవసాయ బావుల వద్దకెళ్లే దారులు చేయడం, గుట్టల కింద కందకాలు తవ్వడం లాంటి ముఖ్యమైన పనులు చేపట్టారు. ఇవి సత్ఫలితాలి వ్వడంతో ఉపాధి హామీ పనులు వ్యవసాయానికి అనుబంధంగా మార్చాలంటూ రైతుల నుంచి డిమాండ్ కూడా మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు మద్దతు తెలిపింది. రోజురోజుకూ ఉపాధి కూలీల నమోదు సంఖ్య పెరుగుతుండగా, అన్ని రకాల అవసరాలకు జాబ్ కార్డు తప్పనిసరైంది. దీంతో, కార్డులు తీసుకున్న వారి సంఖ్య పెరుగుతుండగా, కూలీలకు తగ్గట్టుగా నిధుల కేటాయింపు జరగడం లేదు. కొన్నాళ్లుగా కేంద్రం ఈ పథకాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది.
ఏటేటా నిధుల తో పాటు పని దినాలు కూడా తగ్గిస్తున్నది. దీంతో, పేదలకు నామమాత్రంగానే పని లభిస్తుండగా, ఆపనికి తగిన వేతనం కూడా సక్రమంగా విడుదల చేయడం లేదు. దీనిపై పలు వామపక్ష పార్టీలతో పాటు ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు కూ డా కేంద్రం తీరుపై మండిపడుతుండంతో, పను ల అమలులో పలు రకాల ఆంక్షలు విధిస్తూ, నిధు లు విదుల్చుతోంది. ఉపాధి పనులపై రాష్ర్టాల ఆజమాయిషీ తగ్గిస్తూ, రెండు పూటలా పనులు చేస్తున్న చోటు నుంచే ఫోటోలు తీసి పంపాలం టూ సాప్ట్వేర్ను తమ ఆధీనంలోని ఎన్ఐసీ సాం కేతిక సంస్థకు అనుసంధానం చేసి కూలీలను పొ మ్మనలేక పొగబెట్టింది. జిల్లాలోని 313 గ్రామా ల్లో 2,31,313 జాబ్కార్డులున్న కూలీలుండగా, 1లక్ష 32వేల మందికి పైగా కూలీలు పనులకు హాజరవుతున్నారు. 99వేల పైచిలుకు మంది వివి ధ కారణాలతో పనులకు గైర్హాజరవుతుండగా, వా రిని తొలగించి నిధుల భారం తగ్గించుకునేందుకు సిద్ధమవుతుంది. కేంద్రం తీరుపై కార్మిక సంఘా లు తీవ్రంగా మండిపడుతూ, ఆందోళనలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి.
కేంద్ర వ్యవహార శైలి దుర్మార్గం
రెక్కాడితే గానీ డొక్కాడని పేద కూలీల కోసం వామపక్షాలు పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కూలీల ఉపాధి దెబ్బతీసేందుకు అరకొర నిధులు విడుదల చేస్తూ, పనుల నిర్వహణపై ఆంక్షలు విధించటం సిగ్గుచేటు. రెండు పూటలా ఫోటోలు అప్లోడ్ చేయించడం, గతంలో మాదిరి 40 పనులు కాకుండా వాటిని 20కి కుదించటం కూడా ఉపాధి పని ఎత్తేసే కుట్రలో భాగమే. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టేందుకు కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాం.
– కె.సృజన్కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి