మెట్పల్లి/కోరుట్ల, నవంబర్ 1: ‘ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ప్రతిపక్షాలు ఆగమాగమవుతున్నయి. ఏం చేయాలో తెలియక ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నయి. ఇది చేస్తం.. అది చేస్తమని ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నయి. మరి రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించినపుడు ఇవన్నీ ఎందుకు చేయలేదు? ప్రజల కష్టాలు తీర్చలేదెందుకు..? అప్పుడు చేయనోళ్లు.. ఇప్పుడు చేస్త రా..? వాళ్లవన్నీ ఝూటా మాటలే. హామీలన్నీ నీటిమూటలే. ఏ ఒక్కటీ అమలు చేయరు. కర్ణాటక ప్రజలను అట్లనే ముంచిన్రు. నేనొక్కటే చె బుతున్నా. వాళ్ల మాటలు నమ్మితే మనం కూడా మోసపోతం.
గోసపడుతం’ అని కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతోనే రాష్ట్ర సు భిక్షంగా ఉంటుందని, సమగ్రాభివృద్ధి, సంక్షే మం జరుగుతుందన్నారు. తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి మధ్య తేడా గమనించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని, నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. బుధవారం మెట్పల్లి పట్టణంలోని 12వ వార్డుల్లో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మె జార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, దీన్దయాల్ నగర్, ఇందిర ప్రియదర్శిని కాలనీకి చెందిన మహిళలు, యువకులు సంజయ్ కల్వకుంట్లకు అపూర్వ స్వాగతం పలికారు. కాగా, త మ కాలనీకి వచ్చిన సంజయ్ కల్వకుంట్లకు మద్దతుగా పలువురు యువకులు జైకొట్టారు. బీఆర్ఎస్లో చేరగా, వారికి సంజయ్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయన వెంట మున్సిపల్ వైస్చైర్మన్ బీ చంద్రశేఖర్రావు, నాయకులు రవికాంత్, వెంకటేశ్, జావీద్ పాల్గొన్నారు.
కోరుట్లలో చేరికల జోరు కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కల్వకుంట్ల, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు సమక్షంలో సుమారు 200 మంది యువకులు, ఆటో యూనియన్ సం ఘం నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి సంజయ్, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు బీఆర్ఎస్ పార్టీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. డాక్టర్ సంజయ్ కల్వకుంట్లకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ గెలుపుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, మైనార్టీ పట్టణాధ్యక్షుడు ఫహీమ్, కౌన్సిలర్లు సజ్జు, జిందం లక్ష్మీనారాయణ, నాయకులు బాబా, ఆటో యూనియన్ నాయకులున్నారు.