జగిత్యాల కలెక్టరేట్, నవంబర్ 17: జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత శనివారం పర్యటించనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్కు మద్దతుగా నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల పట్టణం, రాయికల్, బీర్పూర్ మండలాల్లో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం, కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు.
ఉదయం రాయికల్ మండలంలోని మైతాపూర్ లో, ఇటిక్యాల, తాట్లవాయి-కట్కాపూర్ ఎక్స్ రోడ్, బీర్పూర్, మధ్యాహ్నం రాయికల్ మండలంలోని అల్లీపూర్, రాయికల్ పట్టణం లోని ఓల్డ్ బస్టాండ్, గాంధీ విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్, ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనం తరం సాయంత్రం ఏడు గంటలకు జగిత్యాల పట్టణంలో మంచినీల్ల బావి వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.