జగిత్యాల, మార్చి 8: జీవో-3ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ అమలులో జరుగుతున్న అన్యాయంపై హైదరాబాద్లోని ఇందిరాపార్ ధర్నాచౌక్ వద్ద ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ధర్నాచౌక్లో కవితతో కలిసి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు.
అలాగే వేములవాడ రాజరాజజేశ్వర స్వామి, పెంబట్ల దుబ్బరాజేశ్వరస్వామి తీర్థప్రసాదాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దావ వసంత-సురేశ్ దంపతులు అందజేశారు. పరమశివుడి ఆశీస్సులు కవితపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.