జమ్మికుంట, జూలై 24: జమ్మికుంట-హుజూరాబాద్లను గొప్ప జంట నగరాలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, దేశిని స్వప్న-కోటి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు టంగుటూరి రాజ్కుమార్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్ వద్ద టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయతో కలిసి ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఒకరికొకరు తినిపించుకున్నారు. స్థానికులకు పంపిణీ చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం నిధుల వరద పారిస్తున్నారని, వారికి రుణపడి ఉండాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ ఇచ్చిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పిలుపులో భాగంగా మండలంలోని కోరపల్లి ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటానని, స్కూల్, గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ బర్త్ డే వేడుకలు ఆనందాన్నిస్తున్నాయని, వేడుకలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలుపొందిన సంబురాలుగా అభివర్ణించారు. తర్వాత కార్యకర్తలతో నృత్యాలు చేశారు. ఈద్గాలో మొక్కలు నాటారు. అంతకుముందు ఎమ్మెల్సీకి భారీ స్వాగతం పలికారు. డోలు చప్పుళ్లు, పటాకులు కాల్చారు. స్వీట్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో కౌన్సిలర్లు వీరన్న, భిక్షపతి, రవీందర్, విజయలక్ష్మి-మల్లయ్య, అరుణ-రవీందర్, స్వరూప-శ్రీహరి, ప్రణీత-దిలీప్, రాధ-సదానందం, శ్వేత-రమేశ్, శ్రీనివాస్, మల్లయ్య, నరేశ్, సుగుణ-వెంకటేశ్, రామ్మోహన్, రాము, సారంగం, రమేశ్, భాస్కర్, శ్రీలత-సంపత్, రాజయ్య, దీప్తి-కిషన్రెడ్డి, సదానందం, రాజ్కుమార్, లావణ్య-సంపత్ పాల్గొన్నారు.