MLA Vijayaramana Rao | కాల్వశ్రీరాంపూర్, ఫిబ్రవరి 20 : కాల్వశ్రీ రాంపూర్ లోని శ్రీ జగత్ మహా మునీశ్వర స్వామి ఆశ్రమం లో మార్చి 13నుండి 15.వరకు జరిగే శత రుద్ర మహా యాగం వాల్ పోస్టర్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శత రుద్ర మహా యాగం ద్వారా ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం కలిగి అందురూ సుఖ సంతోషాలతో ఉండాలని, లోక కల్యాణార్థం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు.
అలాగే తన వంతు సహాయ సహకారం అందిస్తానని, ఆశ్రమ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పిఠాధిపతులు బసవత్తుల రాజ మౌళి శ్వర స్వామి, సర్పంచ్ బంగారు రమేష్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, గోవర్ధన శాస్త్రి, మునీందర్ తదితరులు పాల్గొన్నారు.