ఎలిగేడు, డిశంబర్ 29: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న 6 గ్యారంటీ హామీ పథకాలను అర్హులైన వారందరికీ అందిస్తామని ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు పేర్కొన్నారు. శుక్రవారం సుల్తాన్పూర్లో జరిగిన ప్రజాపాలన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు ఇస్తున్న అర్జీలకు రేషన్ కార్డు, ఆధార్ కార్డుల జిరాక్స్ ప్రతులను (2) మాత్రమే జతచేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వరరావు, అదనపు కలెక్టర్ ఆరుణశ్రీ, జడ్పీటీసీ రేణుక, ఎంపీపీ స్రవంతి, స్పెషల్ ఆఫీసర్ తిరుపతిరావు, ఉపసర్పంచ్ హరీశ్గౌడ్, మాజీ సర్పంచ్ కొండ తిరుపతిగౌడ్, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, ఎంపీవో అనిల్రెడ్డి పాల్గొన్నారు.
సుల్తానాబాద్రూరల్, డిసెంబర్29: మండలంలోని కాట్నపల్లి, గర్రెపల్లి, నారాయణరావుపల్లి, కందునూరిపల్లి గ్రామాల్లో అధికారులు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించారు. కాట్నపల్లి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై దరఖాస్తులను స్వీకరించారు. గర్రెపల్లిలో అదనపు కలెక్టర్ శ్రామ్ప్రసాద్లాల్ దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సంవర్థక శాఖ అధికారి రవీందర్రెడ్డి, ఎంపీపీ బాలాజీరావు, జడ్పీటీసీ స్వరూప, ఎంపీడీవో శశికళ, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సర్పంచులు మోహన్రెడ్డి, సుజాత-రమేశ్గౌడ్, స్వరూప, స్వరూప-తిరుపతి, నాయకులు ప్రకాశ్రావు, సతీశ్రావు, ఆనందరావు, శేఖర్, మనోజ్గౌడ్, సాయిరి మహేందర్, ఎంపీటీసీలు అనిత-అంజయ్య, అనూష, రమేశ్ ఉన్నారు.
పెద్దపల్లి టౌన్, డిసెంబర్ 29: అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందని ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. శుక్రవారం 10,11వ వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించి రసీదులు అందజేశారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, కౌన్సిలర్లు మాధవి, చంద్రశేఖర్, మల్లయ్య, అమ్రేశ్, సుభాష్రావు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, డిసెంబర్29: కాల్వశ్రీరాంపూర్, ఓదెల చివరి ఆయకట్టుకు సాగునీరందించి పంటలను కాపాడుతామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు భరోసా కల్పించారు. కూనారంలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన గ్రామ సభకు కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. లబ్దిదారుల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు గ్యారెంటీ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం, ఇప్పలపల్లె, లక్ష్మీపురం, జాఫర్ఖాన్పేట, కిష్టంపేట, మడిపల్లి గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు జరిగాయి. కూనారంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాపాలన గ్రామ సభలో దరఖాస్తులు సమర్పించలేని వారు జనవరి 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచ్ డొనికెన విజయమొగిలి, ఎంపీటీసీ కొల్లూరి రమారాజమల్లు, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, డీఏవో ఆదిరెడ్డి, తహసీల్దార్ జాహెద్పాషా, ఎంపీడీవో రామ్మోహనాచారి, ఎంపీ వో గోవర్ధన్, ఉప సర్పంచ్ తిరుపతి, ఏవో నాగార్జున, ఏపీవో మంజుల పాల్గొన్నారు.