మల్లాపూర్, డిసెంబర్, 16 : స్వరాష్ట్రంలో పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో ఆర్అండ్బీ శాఖ నిధులు రూ.72 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం కేసీఆర్కు గ్రామీణుల కష్టసుఖాలన్నీ స్పష్టంగా తెలుసని, అందుకే పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. గ్రామాల్లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సమష్టిగా కృషి చేస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ఇక్కడ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో రాజశ్రీనివాస్, సర్పంచ్ నత్తి లావణ్య, ఎంపీటీసీ ఆరె రాజేందర్, కేడీసీసీబీ డైరెక్టర్ తక్కళ్ల నరేశ్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కదుర్క నర్సయ్య, వైస్ ఎంపీపీ గౌరు నాగేశ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మైదాసు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఏనుగు రాంరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.