పల్లె ప్రగతి దినోత్సవంతో ప్రతీ పల్లె మురిసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఈ వేడుక ఊరూరా సంబురంగా సాగింది. బతుకమ్మలు, బోనాల ర్యాలీలతో హోరెత్తించారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, సర్పంచులు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. ‘పల్లె ప్రగతి’తో గ్రామాల్లో సాధించిన అభివృద్ధిపై ఫొటో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామ పంచాయతీల కార్మికులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించి, ఘనంగా సన్మానించారు. కాగా, కరీంనగర్ మండలంలోని చెర్లభూత్కూర్లో మంత్రి గంగుల కమలాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ కర్ణన్ పాల్గొనగా, గంగాధర మండలంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, హుజూరాబాద్ నియోజకవర్గంలో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి హాజరై ‘పల్లె ప్రగతి’తో గ్రామాల్లో సాధించిన అభివృద్ధిని వివరించి, సిబ్బందిని అభినందించారు.
గంగాధర, జూన్ 15: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్తోనే సాకారమవుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని ముప్పిడినర్సయ్యపల్లి, లింగంపల్లి, చెర్లపల్లి(ఆర్), చెర్లపల్లి(ఎన్), లక్ష్మీదేవిపల్లి, ఇస్లాంపూర్, తాడిజెర్రి, చిన్న ఆచంపల్లి, మల్లాపూర్ గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరిపాలన సౌలభ్యం కోసమే ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిందని, గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, సర్పంచులు పబ్బతి మల్లమ్మ, తోట పద్మ, పుల్కం స్వరూపారాణి, పొట్టల కనకయ్య, తాళ్ల విజయలక్ష్మి, వడ్లూరి అనిత, రామిడి కనకమ్మ, దోర్నాల హన్మంతరెడ్డి, ఆకుల శంకరయ్య, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ఎగుర్ల మల్లమ్మ, ద్యావ మధుసూదన్రెడ్డి, కోలపురం లక్ష్మణ్, నాయకులు పబ్బతి తిరుపతిరెడ్డి, తోట నాంపెల్లి, వడ్లూరి ఆదిమల్లు, రామిడి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.