బోయినపల్లి, మార్చి 4: కరెంట్షాక్తో మరణించిన రైతు కుటుంబానికి సర్కారు కొండంత అండగా నిలిచింది. రైతుబీమాతోపాటు ప్రభుత్వపరంగా సాయమందించింది. వివరాల ప్రకారం.. బోయినపల్లి మండలం మల్లాపూర్కు చెందిన ఇల్లందుల పరశురాం 2022 సెప్టెంబర్7న కరెంట్షాక్తో మరణించాడు. ఆయన పేరిట 15.5 గుంటల వ్యవసాయ భూమి ఉండడంతో రైతుబీమా కింద 5లక్షల పరిహారం, ప్రభుత్వం మరో 5లక్షలు మం జూరు చేసింది.
అందుకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రం, చెక్కులను శనివారం స్వయంగా పరశురాం ఇంటికి వెళ్లి ఆయన భార్య పద్మకు అందజేశారు. చెక్కును అందుకున్న కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆదుకున్న కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అలాగే కొదురుపాక రైతు వేదికలో పలువురి లబ్ధిదారులకు సీఎంసహాయనిధి చెక్కులను మంజూరు చేశా రు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు జోగినపల్లి రవీందర్రావు, జోగినపల్లి ప్రేమ్సాగర్రావు తదితరులు ఉన్నారు.