జగిత్యాల, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం జగిత్యాలలో పర్యటించారు. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ సందర్భంగా సామాన్యుడిలా ఇంటింటికీ వెళ్లి అందించారు. కృష్ణానగర్లో చెక్కులను అందించి, అక్కడే ఉన్న బీడీ కార్ఖానా కు వెళ్లారు. బీడీ కార్మికులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. నేల మీద కూర్చొని, ఆప్యాయంగా మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. పింఛన్ వస్తున్నదా..? అని అడిగారు.
రాష్ట్ర ప్ర భుత్వం బీడీ కార్మికులకు జీవనభృతి పేరిట 2,016 పింఛన్ ఇస్తున్నదని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా పింఛన్ ఇవ్వలేదని, మన రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో సీఎం కేసీఆర్ను ఒప్పించి బీడీ కార్మికులకు పెన్షన్ ఇప్పించిన విషయాన్ని వివరించారు. ఆరేండ్లలో ఒక్కో కార్మికురాలికి కనీసం 1.30లక్షల వరకు సాయం అందిందన్నారు. సాధారణ వ్యక్తిలా ఎ మ్మెల్యే తమ బాగోగులు తెలుసుకోవడంతో మ హిళలు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పుణ్యమాని వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మ హిళలు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తుండడంతో ఆత్మగౌరవం పెరిగిందని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆడవాళ్ల పేరి ట ఇవ్వడంతో రందీ లేకుండా పోయిందని పే ర్కొన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు దేవుడిచ్చిన అన్న అని కొనియాడారు.