మెట్పల్లి రూరల్, డిసెంబర్ 24: మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేటలో ఆదివారం ఓ ఇల్లు షార్ట్సర్క్యూట్తో దగ్ధమైంది. పొలం కాడికి వెళ్లొచ్చే లోపే కాలిబూడిదైంది. దీంతో గడ్డం చిన్నోళ్ల పెద్దసత్తయ్య కుటుంబం కన్నీరుమున్నీరైంది. ఇంట్లో దాచుకున్న 4.20 లక్షల నగదు, పది తులాల బంగారం, సామగ్రి కాలిపోయిందని విలపించింది.
కాగా, విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల వెంటనే అక్కడకు చేరుకొని, బాధితులను ఓదార్చారు. ‘భయపడకు.. మీకు నేనున్నా’ అంటూ ధైర్యమిచ్చారు. సొంతంగా పది వేల సాయం అందించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఆయన వెంట ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచ్ శ్రీధర్, ఎంపీటీసీ నోముల గంగాధర్ ఉన్నారు.