మానకొండూర్, మార్చి 20: ప్రతిపక్ష నా యకులు నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాల తో ఆటలాడుకోవద్దని రాష్ట్ర సాంస్కృతిక సార థి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బా లకిషన్ హెచ్చరంచారు. సోమవారం మండల కేంద్రంలో బీఅర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ రాజ్యాంగబద్దంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, దాంట్లో రాష్ట్ర ప్ర భుత్వ ప్రమేయం పరిమితంగా ఉంటుందని, కమిషనే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.
అయి తే, ఇటీవల జరిగిన పేపర్ లీక్ వ్యవహారం అత్యంత బాధాకరమని, ఈ పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిందని చెప్పారు. నిరుద్యోగులకు న్యా యం చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఅర్, మంత్రి కేటీఅర్ పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించారని గుర్తుచేశారు. ఘటనకు బాధ్యులైన వారిని ఇప్పటికే అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. దీన్ని కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆసరాగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు, రాజకీయ లబ్ది కోసం విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. ప్రతి పక్షాలు చేస్తున్న రాద్దాంతాన్ని ప్రజ లు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల వలలో పడి విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని రసమయి సూచించారు.
చదువురాని దురదృష్టవంతుడు బండి
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ చ దువు రాని, విజ్ఞానం లేని దురదృష్ట వంతుడు అని, అతడు ఏం మాట్లాడుతాడో అతనికే తెలువదని ఎద్దేవా చేశారు. విషయ పరిజ్ఞానం తెలుసుకుని మాట్లాడాలని హితువు పలికారు. బం డి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శవరాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. పేపర్ లీకేజీ వ్యవహారానికి మంత్రి కేటీఅర్కు సంబంధముందని బండి సంజయ్ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టా ల్లో ఎన్నోసార్లు పేపర్లీక్ అయిన ఘటనలు ఉన్నాయని, మరి ప్రధాని మోదీ ఎన్నిసార్లు రాజీనామా చేయాలని ప్రశ్నించారు.
మంత్రి కేటీఅర్ నిరుద్యోగులకు అండగా నిలిచారని, ప్రభుత్వ స్టడీ సర్కిళ్లలో ఉచిత కోచింగ్, భోజన వసతి, స్టడీ మెటిరియల్ ఇప్పించి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఅర్ఎస్ పార్టేనని స్పష్టం చేశారు. సమావేశంలో అర్బీఎస్ జిల్లా కన్వీనర్ గూడెల్లి తిరుపతి, మానకొండూర్, శంకరపట్నం, గన్నేరువరం జడ్పీటీసీలు తాళ్లపెల్లి శేఖర్గౌడ్, లిం గంపల్లి శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి, బీఅర్ఎస్ పార్టీల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.