వేములవాడ రూరల్, నవంబర్ 17 : నియోజకవర్గంలో రూ.60 కోట్లతో పలు రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాలకు అనుమతులు లభించినట్లు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు వెల్లడించారు. గురువారం వేములవాడ రూరల్ మండ లం మర్రిపెల్లిలో రూ.2 కోట్లతో నిర్మించే హైలెవల్ బ్రిడ్జి, మారుపాక నందికమాన్ వద్ద రూ.87 లక్షలతో చేపట్టే సుందరీకరణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడేది లేదన్నారు. రూ.10 కోట్లతో గుడి నుంచి జగిత్యాల బస్టాండ్, వేములవాడ-కోరుట్ల బస్టాండ్ వరకు రోడ్ల నిర్మాణాలకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. సినారె భవనం, స్టేడియం నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు.
బద్దిపోచమ్మ స్థల సేకరణ, ఉన్న కట్టడాలను తొలగించే ప్రకియ పూర్తయిందన్నారు. కస్తూర్భా పాఠశాలలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించి, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీలు బూర వజ్రమ్మ, బండ మల్లేశం, జడ్పీటీసీలు మ్యాకల రవి, ఏశ వాణి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఏశ తిరుపతి, వేములవాడ సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెల్మ బాల్రెడ్డి, సర్పంచ్ కట్కం మల్లేశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోస్కుల రవి, సర్పంచులు సుమన్, కౌన్సిలర్ నీలం కల్యాణి, అజయ్, రాంచంద్రం పాల్గొన్నారు.