వేములవాడ, నవంబర్ 22: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పదేండ్ల పరిపాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల వివరించేందుకు వేములవాడకు వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎ న్నికల ప్రచారం నేపథ్యంలో ఈనెల 26(ఆదివా రం)న పట్టణంలోని కోర్టు వద్ద జరిగే బహిరంగ సభకు ఆయన హాజరవుతారని తెలిపారు. అభివృ ద్ధి సంక్షేమాలను వివరించి వేములవాడ బీఆర్ ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావును, కేసీఆర్ను మూడోసారి సీఎం చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
అంతకుముందు వారు సభ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీ రేవతి, పార్టీ అధ్యక్షుడు గోసుల రవి, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు కట్కం మల్లేశం, కౌ న్సిలర్లు మారం కుమార్, జోగిని శంకర్, సిరిగిరి రామచందర్, శ్రీనివాసరావు, నాయకులు నామా ల లక్ష్మీరాజం, రామతీర్థపు రాజు, తీగల వెంకటేశ్వర్ రావు, గూడూరి మధు, కొండ కనకయ్య, పీచర భాసర్ రావు, ముప్పిడి శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, యపెంట బాబు, లికిడి మహేందర్, అంజత్ పాషా, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.