హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి జన్మదిన వేడుకలను రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి కేక్ కట్ చేయగా. మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆయనకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ఉదయం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.