హుజూరాబాద్, జనవరి 18: ‘బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదని అధైర్య పడద్దు. ఎల్లవేళలా అండగా ఉంటా’ అని పార్టీ శ్రేణులకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు. త్వరలోనే గులాబీ పార్టీకి మంచిరోజులు రానున్నాయని చెప్పారు. తాను పార్టీ వీడుతున్నట్లు కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని కొట్టిపడేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ను వీడబోనని, కేసీఆర్ వెంటే నడుస్తానని స్పష్టంచేశారు.
సర్పంచుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో హుజూరాబాద్ సిటీ సెంట్రల్లో గురువారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌశిక్ మాట్లాడారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని, పట్టుబట్టి ఆయన రాష్ర్టాన్ని సాధించారని, ఆపై అధికారం చేపట్టి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. కాంగ్రెస్ హనీమూన్లో ఉన్నదని, వందరోజులు పూర్తి కాగానే తమ పార్టీ ప్రజల తరుఫున కార్యాచరణ ప్రకటిస్తుందని చెప్పారు.
తన గెలుపులో సర్పంచులు కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. సర్పంచులెవరూ నిరుత్సాపడవద్దని, వచ్చే పంచాయతీ ఎన్నికల్లో విజయం కోసం పనిచేయాలన్నారు. వారికి తన సహకారం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం 93 మంది సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఇక్కడ జడ్పీచైర్పర్సన్ కనుమల్ల విజయ, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, నాయకులు ఇరుమల్ల సురేందర్రెడ్డి, ముసిపట్ల తిరుపతిరెడ్డి, పొల్నేని సత్యనారాయణరావు, మాడ సాదవరెడ్డి, కన్నూరు సత్యనారాయణరావు ఉన్నారు.
హుజూరాబాద్టౌన్/వీణవంక,జనవరి 18 : హుజూరాబాద్ పట్టణంలో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు సొల్లు బాబు తల్లి సొల్లు సంతోషమ్మ, గుండెపోటుతో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ప్రతాప శివ తండ్రి ప్రతాప మొండయ్య కు టుంబాలను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి గురువారం సందర్శించి మృతుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు.
కు టుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వారి వెంట కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్రెడ్డి, అపరాజ ముత్యంరాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గందె శ్రీనివాస్ నాయకులు ఉన్నారు. అలాగే వీణవంక మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్ పత్తి కొండాల్రెడ్డి అనారోగ్యానికి గురి కాగా ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి పరామర్శించారు. రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఇక్కడ ఎంపీపీ రేణుకాతిరుపతిరెడ్డి, వైస్ఎంపీపీ లతాశ్రీనివాస్, సర్పంచ్ నీల కుమారస్వామి, నాయకులు మహేశ్ ఉన్నారు.