బోయినపల్లి, మార్చి 1: గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంతోపాటు తడగొండ, స్తంభంపల్లి, గుండన్నపల్లి, కోరెం, బూరుగుపల్లి గ్రామాల్లో రూ.35లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.
అనంతరం మాట్లాడుతూ, గ్రామాలు అభివృద్ధి పథంలో ఉంచేందుకు కృషి చేస్తామన్నారు. బోయినపల్లిలోని ఆదర్శ పాఠశాల వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ వేణుగోపాల్, తహసీల్దార్ పుష్పలత, తదితరులు ఉన్నారు.