సిరిసిల్ల రూరల్, జనవరి 20: వచ్చే నెల ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో తంగళ్లపల్లి మండ లం బస్వాపూర్లో నిర్వహించే ఎల్లమ్మ సిద్ధోగం వేడుకలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ను గౌడ సంఘం మండలాధ్యక్షుడు, బీఆర్ఎస్ నేత తాటిపాముల శ్రీనివాస్గౌడ్ ఆహ్వానిం చారు.
ఈ మేరకు ఆయన హైదరాబాద్లో కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందించారు. ఆయన వెంట నాయ కులు మోతె మహేశ్, తాటిపాముల ప్రణయ్ గౌడ్, సత్తు ప్రశాంత్రెడ్డి ఉన్నారు.
బస్వాపూర్కు చెందిన బీఆర్ఎస్వై నేత సత్తు ప్రశాంత్రెడ్డిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెం ట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆశీర్వదించారు. ప్రశాంత్రెడ్డి తన బర్త్డే సందర్భంగా కేటీఆర్ను కలువగా, ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ సీనియర్ నేతలు తాటిపా ముల శ్రీనివాస్గౌడ్, మహేశ్యాదవ్, ప్రశాంత్రెడ్డి, ప్రణయ్గౌడ్ ఉన్నారు.