గోదావరిఖని, ఆగస్టు 4 : రామగుండంలో టీ ఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే తనపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. ఆర్ఎఫ్సీఎల్ కార్మికులను అడ్డుపెట్టుకొని కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డా రు. ఆరోపణలను నివృత్తి చేయడం కోసమే బహిరంగ చర్చకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. గురువారం గోదావరిఖనిలోని క్యాంపు కార్యాల యం నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆర్ఎఫ్సీఎల్ గేటు వద్ద జరిగే బహిరంగ చర్చకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు ఎమ్మెల్యేను అడ్డుకొని, గృహ నిర్బం ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ ప్ర జలు, అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి మా ట్లాడారు.
ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగ కుంభకోణం లో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, ప్రజా క్షేత్రంలో వాటిని నివృత్తి చేసేందుకే బహిరంగ చర్చకు సన్నద్ధమయ్యామన్నారు. ఉద్యోగా లు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సాధారణ కుటుం బం నుంచి వచ్చిన తనకు పేదల కష్టాలు తె లుసునని, బాధితులకు న్యాయం జరిగే వరకూ అండ గా ఉంటానని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు విష ప్రచారం చేయడం మానుకోవాలని హితవుపలికారు. గతంలో ఏ ఎమ్మెల్యే చేయలేని అభివృద్ధిని రామగుండంలో చేస్తున్నందుకే తనపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బాధితులకు సహా యం చేసేందుకు 18 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యేక ఫోన్ నంబర్ను కేటాయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ అనిల్కుమార్, జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, నాయకులు పీటీ స్వామి, శంకర్ గౌడ్, పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు ఇంజపురి పులెందర్, దొంత శ్రీనివాస్, ధాతు శ్రీనివాస్, సాగంటి శంకర్, పెంట రాజేశ్, కుమ్మరి శ్రీను, బాల రాజ్కుమార్, కృష్ణవేణి, కవితా సరోజని, అంజలీ దేవి, రాకం లత తదితరులు పాల్గొన్నారు.