గోదావరిఖని, నవంబర్ 22: కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు చేసిందేమీలేదని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ విమర్శించారు. ఈ నెల గోదావరిఖనిలోని స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణు లు, ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఖని చౌరస్తాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్జీ-1 జీడీకే-2ఏ గనిపై ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొని కార్మికులను ఆప్యాయంగా పలకరించారు. కోరుకంటి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక దశాబ్ది కాలంలోనే కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు.
అంతేగాక సీఎం కేసీఆర్ సహకారంతో కేటీఆర్ అండదండలతో రామగుండాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశానని అన్నారు. రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించానని చెప్పా రు. యువత ఉపాధి కోసం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్చే రూ.30 కోట్లతో ఐటీ పార్కు ఫౌండేషన్, 102 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు డబ్బు సంచులతో ఓటర్లను మభ్యపెట్టడానికి వస్తున్నారని ప్రజలు గమనించాలన్నారు. 30న జరిగే ఎన్నికల్లో స మాజ అభివృద్ధిని కాంక్షించే కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చా రు. సమావేశంలో మేయర్ అనిల్ కుమార్, సర్పంచ్ లయ్మీపతి, నాయకులు కౌశిక హరి, రాంమ్మూర్తి, మురళీధర్రావు, దేవరాజు, పిల్లి రమేశ్, చిప్ప రాజేశం, వాసు, మండ రమేశ్, శ్రీహరి, చంద్రయ్య తదితరులున్నారు.
అలాగే స్థానిక 49వ డివిజన్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. స్థానిక మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. 2018లో గెలిచిన తర్వాత కరోనాతో రెండేళ్ల పాటు రామగుండంలో అభివృద్ధి కుంటుపడిందని ఆ తర్వాత కోట్లాది రూపాయలతో అభివృద్ధిని ఆపకుండా ఇతర ప్రాంతాలకు ధీటుగా తీర్చిదిద్దాననన్నా రు. 53 యేండ్ల కాంగ్రెస్ పాలనలో ఆకలి చావు లు, ఆత్మహత్యలతో ప్రజల జీవనం ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కొత్త పథకా లు అమలు కావాలంటే మళ్లీ మూడోసారి కేసీఆర్ ను సీఎం చేయాలని కోరారు.
అనంతరం ఆ యన ఇంటింటికి వెళ్లి మ్యానిఫెస్టో గురించి వివరించారు. కార్యక్రమంలో మేయర్ అనిల్కుమార్, కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేశ్, రాజ్కుమార్, నాయకులు మురళీధర్, పీటీ స్వామి, నూతి తిరుపతి, స్వామి, సతీశ్, జాహిద్, లింగ య్య, శ్రీనివాస్, యాకుబ్ తదితరులున్నారు.