జగిత్యాల, డిసెంబర్ 17: కేసీఆర్ హయాంలోనే రిటైర్డ్ ఉద్యోగులకు పెద్దపీట వేశామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల క్లబ్లో జాతీయ పెన్షనర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా 70 ఏండ్లు పూర్తి చేసుకున్న పెన్షనర్లను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. పెన్షనర్ల భవనంలో ఆడిటోరియం నిర్మాణానికి 5 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అత్యధిక మొత్తంలో పెన్షన్లు ఇచ్చామన్నారు.
దేశంలో కెల్లా తెలంగాణలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అధిక వేతనాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ దవాఖానలో క్యాన్సర్ రోగుల కోసం పాలియేటివ్ కేర్ యూనిట్ను ఏర్పాటు చేశామన్నారు. వైద్య సిబ్బంది స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి సేవలు సైతం అందిస్తున్నారని వివరించారు. వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేసి పేద, మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. వైద్య పరంగా ఏ అవసరం ఉన్నా అందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని, కంటి వైద్యం సైతం అందిస్తానని భరోసా కల్పించారు.
కేసీఆర్ జగిత్యాల జిల్లాకు మెడికల్ కళాశాల కేటాయించడంతో నేడు మెడికల్ హబ్గా మారిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ పని చేసి, తెలంగాణను దేశంలోనే అగ్ర భాగాన నిలిపారని కొనియాడారు. దేశంలో ఎకడా లేని విధంగా ఆరు అడుగుల మేర భూగర్భ జలాలు పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమేనన్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ద్వారా 50 రకాల జిల్లా కార్యాలయాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, దీంతో ప్రజలు, ఉద్యోగులకు పరిపాలన సౌలభ్యం కలిగిందని, నిత్యం కరీంనగర్ వెళ్లే బాధ తీరిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆరు గ్యారంటీల హామీల అమలుకు కృషి చేయాలని కోరారు. డీఏ, ఏరియర్స్, పీఆర్సీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిషారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పెన్షనర్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గంగరాజం, ప్రధాన కార్యదర్శి కరబుజ రవీందర్, కౌన్సిలర్లు ముసు నారాయణరెడ్డి, కౌన్సిలర్ పంబాల రామ్కుమార్, యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి, చేని అనిల్, నూర్ బాషా అధ్యక్షులు అజ్జు భాయ్, సుంకె మహేశ్, పవన్, చిట్ల మనోహర్, మహేశ్, యూనిట్ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.