సారంగాపూర్, డిసెంబర్ 29: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం బీర్పూర్లోని రైతు వేదిక ఆవరణలో 14 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 12లక్షల మందికి కల్యాణలక్ష్మి పథకాన్ని అందించిన ఘనత కేసీఆర్దేనని, జగిత్యాల నియోజకవర్గంలో 12వేల మంది కల్యాణలక్ష్మి ద్వారా లబ్ధిపొందారన్నారు.
కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ముందుంచారన్నారు. రూ.130 కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామన్నారు.ప్రభుత్వానికి సహకరిస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామన్నారు. అనంతరం కొలాయి గ్రా మంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశా రు.
ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మొదటిసారి సంజయ్ కుమార్ రావడంతో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సన్మానించి నాగలిని బహూకరించారు. అనంతరం కొల్వాయి, కమ్మునూర్ గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. రేకులపల్లిలో మల్లికార్జున సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ నూతన క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో జిల్లా కేడీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, పార్టీ అధ్యక్షుడు నారపాక రమేశ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రావు, రామకిష్టు గంగాధర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగిత్యాల రూరల్, డిసెంబర్ 29: నర్సింగపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు బక్కశెట్టి తిరుపతి తండ్రి లింగయ్య అనారోగ్యంతో మరణించగా శుక్రవారం జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ సరోజన-మల్లారె డ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మహేశ్, గ్రామశాఖ అధ్యక్షుడు గంగారెడ్డి, నాయకులు రాజిరెడ్డి, మల్లేశం, చంద్రయ్య, నరేశ్, జీవన్, జలంధర్ రెడ్డి పాల్గొన్నారు.
జగిత్యాల, డిసెంబర్ 29: క్రీడల్లో గెలుపోటములు సహజమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలో జగిత్యాల జిల్లా యువజన సర్వీసులు, క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు-2024 ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని, స్వామి వివేకానంద నేటి యువతకు ఆదర్శంగా నిలవాలన్నారు.
యూజీసీ ద్వారా రూ.25 కోట్లు మంజూరు అయ్యాయని, రెండు హాస్టళ్లు, ఆడిటోరియం మంజూరైందన్నారు. జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు రూ.5 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని వివరించారు. అంతకు ముందు యువజనోత్సవంలో భాగంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అశోక్, జిల్లా యువజన, క్రీడా అధికారి రవికుమార్, రాజేంద్రప్రసాద్, సతీశ్, అనిల్ రావు పాల్గొన్నారు.