జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ శనివారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన నేపథ్యంలో పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా బిల్లు కోసం కల్వకుంట్ల కవిత అలుపెరుగని పోరాటం చేశారని అభినందించారు. ఆమె ఒత్తిడితోనే కేంద్రం దిగొచ్చి బిల్లుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. – జగిత్యాల, సెప్టెంబర్ 23