జగిత్యాల రూరల్, డిసెంబర్ 18: రాష్ట్ర ప్రభు త్వం అన్ని కుల సంఘాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమా ర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో రూ.6.60 లక్షల నిధులతో నిర్మించిన గౌడ సం ఘం భవనాన్ని వారు ఆదివారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతను గౌడ సం ఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గౌడ కుల సంఘ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత, తాటి, గిటీవీరక తాటి మొకలు నాటామన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు బాల ముకుందం, ప్యాక్స్ చైర్మన్ సందీప్రావు, సర్పంచ్ మహేశ్వర్రావు, ఎంపీటీసీ పరశురాం, గౌడ సం ఘం అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రాజ న్న, మాజీ సర్పంచ్ సత్యనారాయణరావు, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు అంజి, యూత్ మం డల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, మం చాల రాజు, శివ, సురేశ్, మహేశ్వర్ రావు పాల్గొన్నారు.
జగిత్యాల అర్బన్, డిసెంబర్ 18: పట్టణంలోని 8వ వార్డులోని గోత్రాల కాలనీలో గోత్రాల సంక్షే మ సంఘ భవనంలో బోర్ మోటర్ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణితో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం వార్డులో సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గోత్రాల కాలనీకి సీసీ రోడ్డు టెండర్ పూర్తయిందని, త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. మన బడి-మన బస్తీ కార్యక్రమంలో భాగంగా పాఠశాలను సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ నరేశ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు మల్లవ్వ-తిరుమలయ్య, కూసరి అనిల్, మాజీ కౌన్సిలర్ భూమాగౌడ్, వార్డు అధ్యక్షులు గంగాధర్, ఎల్లయ్య పాల్గొన్నారు.