మెట్పల్లి,ఏప్రిల్29: నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎ మ్మెల్సీ ఎల్ రమణ ఓటర్లకు పిలుపునిచ్చా రు. సోమవారం సాయంత్రం మెట్పల్లి లో స్థానిక ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఇం టింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ప్రజా సం క్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకున్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఆ రెండు పా ర్టీల మాటలను నమ్మి మోసపోవద్దని కోరారు.
ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారని విమర్శించారు. తెలంగాణ ప్రజల గొంతుకను పార్లమెంట్లో వినిపించేందుకు బీఆర్ఎస్ ఎంపీ అ భ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ప దేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు కరెంట్ పోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ కరెంటు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు.
నిరంతరం ప్రజా సంక్షే మం, అభివృద్ధి కోసం పాటుపడే బాజిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని అంతకు ముందు పట్టణంలోని జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న వ్యాపార దుకాణా లు, హో టళ్లు, కూరగాయల మార్కెట్లో వ్యాపారులు, ప్రజలను కలిసి కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు రాణవేని సుజాత, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్రావు, నాయకులు లింగంపల్లి సంజీ వ్, గాజె చిన్నరాజరెడ్డి, ఒజ్జెల బుచ్చిరెడ్డి, రా యల్, లంక గంగాధర్, బర్ల రమేశ్, అంగడి పురుషోత్తం, ద్యావనపల్లి రాజా రాం, బీమనాతి సత్యనారాయణ, మొరపు తేజ, జక్కని బాబు పాల్గొన్నారు.
కోరుట్ల రూరల్, ఏప్రిల్ 29: బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించేందు కు బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని యూసుఫ్నగర్, అయిలాపూర్, కల్లూరు గ్రామాల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కేసీఆర్ స ర్కారు అమలు చేసిన సంక్షే మ పథకాలను ఇం టింటికీ వెళ్లి వివరించాలని సూచించారు. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రా జేశ్, ఎంపీపీ తోట నారాయణ, ఆర్బీఎస్ మాజీ అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, సహకార సంఘం అధ్యక్షుడు గడ్డం ఆదిరెడ్డి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బండి నరేశ్, చంద్రశేఖర్, గంగాధర్ ఉన్నారు.
సారంగాపూర్, ఏప్రిల్29: మండలంలోని బట్టపల్లి, పోతారం, సారంగాపూర్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు సోమవారం ముమ్మర ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ సర్కారు అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివ రించారు. నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపుతోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
జాతీయ పార్టీలను నమ్ముకుంటే ఒరిగేదీ మీ ఉండదని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, ప్రజలు సంతోషంగా లేరన్నారు. రైతులకు రైతుబంధు పెంచుతామని, బోనస్ ఇస్తామని మోసం చేసిందన్నారు. ప్రజలు ఆలోచించి కారు గుర్తు కు ఓటేయాలని కోరారు. ప్రచారంలో జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు గుర్రాల రాజేందర్రెడ్డి, నేతలు జోగినిపెల్లి సుధాకర్రావు, ఢిల్లి రామారావు, నర్సింహారెడ్డి, సాయిలు, గంగారెడ్డి, కోల శ్రీనివాస్ పాల్గొన్నారు.