పెద్దపల్లి/ ఎలిగేడు నవంబర్ 28: ‘రైతుబంధును అడ్డుకున్న కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పం డి.. రైతువ్యతిరేకి రేవంత్రెడ్డికి తగిన గుణపాఠం నేర్పండి’ అంటూ పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేదిలేదు..సచ్చేదిలేదుకానీ, రైతుల నోట్లో మట్టికొట్టేందుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు. ఆ పార్టీకి ఓటువేస్తే అభివృద్ధి ఆగిపోతుందని, ప్రజ లు అధోగతి పాలుకాకతప్పదని హెచ్చరించారు. తనను మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు.
యాభైఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేయలేని ప్రగతిని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో చేసి చూపిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్లీ 50 ఏండ్లు వెనక్కి పోతామని హెచ్చరించారు. మంగళవారం పెద్దపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదిముబారక్, 24 కరెంట్ ఉన్నాయా? మూడు గంటల కరంట్ సాగుకు చాలని చెబుతున్నది కాం గ్రెస్, నిజంగా 3 కరెంటు సరిపోతుందా? లేదా? రైతులు ఆలోచించాలని సూచించారు. 24 కరెం టు, సాగు నీరందించి వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
పెద్దపల్లి నియోజక వర్గాన్ని తొమ్మిదిన్నరేండ్లలో రూ. 2 వేలు కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి చేశానని వివరించారు. పెద్దపల్లి బల్దియాలో రూ. 200 కోట్ల అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలోనే నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది వాస్తవం కాదా? కాంగ్రె స్ అభ్యర్ధి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దపల్లికి చేసిం ది ఏమీ లేదని దుయ్యబట్టారు. ఒకసారి అవకాశం ఇవ్వండని మళ్లీ మొసలి కన్నీరు కారుస్తున్నాడన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అరాచకం పెరుగుతుందన్నారు. పెద్దపల్లిలో కొందరు రియల్టర్లు దుష్పప్రచారం చేస్తున్నారని, వాళ్లకు నష్టం చేసే ఆలోచన లేదని, పట్టణీకరణ పెరుగుతున్న క్రమంలో విశాలమైన రోడ్లు ఉండాల్సిన అవసరముందని చెప్పారు. పెద్దపల్లిలో కూరగాయల మార్కెట్ను తరిలిస్తామని కాంగ్రెసోళ్లు త ప్పుడు మాటలు చెప్పుతూ ప్రజలను నమ్మించే ప్ర యత్నాలు చేస్తున్నారని, వెజ్, నాన్ వెజ్ నూతన మార్కెట్తో పాటు, ప్రస్తుత మార్కెట్ అధునీకరిస్తామని, మార్కెట్ తరిలించే యోచనలేదన్నారు.
మాయ మాటలు, తప్పుడు మాటలు చెప్పే కాంగ్రె స్ అభ్యర్ధికి ఓటు ద్వారా బుద్దిచెప్పాలన్నారు. మంచోళ్లేవరో? ముంచటోళ్లేవరో పెద్దపల్లి ఓటర్లకు తెలుసని, మరో మారు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటమి తప్పదన్నారు. రోడ్ షోలో రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత సీ సత్యనారాయణరెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, ఎంపీపీలు బండారి స్రవంతి శ్రీనివాస్, రేణుకాదేవి, బాలాజీరావు, నూనేటి సంపత్, కూ సుకుంట్ల రమాదేవి రాంగో పా ల్రెడ్డి, స్రవంతి మోహన్రావు జడ్పీటీసీలు గంట రాములు, బొ ద్దుల లక్ష్మణ్, తిరుపతిరెడ్డి,
ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు రామారావు, ట్రినిటీ చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, నాయకులు వేముల రామ్మూర్తి, ఉప్పు రాజ్కుమార్, జ డల సురేందర్, శ్రీనివాస్, మాదిరెడ్డి నర్సింహారెడ్డి, దాసరి చంద్రారెడ్డి, ఇనుగాల అనంతరెడ్డి, లైశెట్టి భిక్షపతి, గాదె మాధవి, పూదరి చంద్రశేఖర్, గాదె మాధవి, కనకలక్ష్మి, శ్రీకాంత్, చందా రమాదేవి, శ్రీధర్, పెద్ద గీతాంజలి, వెంకటేశ్, పైడ పద్మ , నాంసాని సరేశ్, రేవెళ్లి స్వామి, వునుకొండ సు నీల్, బెక్కం ప్రశాంత్, కొయ్యడ సతీష్, సలేంద్ర కొమురయ్య, సలేంద్ర రాములు, పోసాని శ్రీనివాస్, చిట్టవేన వినీత్ కుమార్, రవి, శ్రీను, వాసు, మధు పాల్గొన్నారు.